యాప్నగరం

సెహ్వాగ్ కామెంట్స్‌పై గంగూలీ ఫైర్..!

భారత జట్టు ప్రధాన కోచ్ ఎంపికపై రెండు రోజుల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్‌పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ

TNN 17 Sep 2017, 7:13 pm
భారత జట్టు ప్రధాన కోచ్ ఎంపికపై రెండు రోజుల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్‌పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. కోచ్ ఎంపిక బాధ్యతని క్రికెట్ సలహా కమిటీలో సభ్యులైన సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లకి బీసీసీఐ అప్పట్లో అప్పగించింది. కోచ్ పదవిని ఆశిస్తూ.. సెహ్వాగ్‌తో పాటు టామ్ మూడీ లాంటి ప్రముఖులు తొలుత దరఖాస్తు చేసుకోగా.. రెండో విడద దరఖాస్తు చేసుకున్న రవిశాస్త్రిని చివరికి ప్రధాన కోచ్‌గా కమిటీ ఎంపిక చేసింది. అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న సెహ్వాగ్.. ఇటీవల మీడియా ముందు కోచ్ ఎంపికపై పెదవి విరిచాడు.
Samayam Telugu sourav ganguly calls virender sehwags setting comment foolish
సెహ్వాగ్ కామెంట్స్‌పై గంగూలీ ఫైర్..!


‘కోచ్‌ను ఎంపిక చేసిన వారితో నాకు ఎలాంటి సత్సంబంధాలు లేవు. అందుకే నేను కోచ్‌గా ఎంపికవలేదు. బీసీసీఐలోని ఉన్నత స్థాయి అధికారులు నాకు కోచ్ పదవిని ప్రతిపాదించడంతో నేను దరఖాస్తు చేసుకున్నా. రవిశాస్త్రి రేసులోకి వస్తాడని తెలుసుంటే నేను అసలు అఫ్లై చేసుండేవాడినే కాదు. జీవితంలో ఇక ఆ పదవి ఆశించను’ అని సెహ్వాగ్ ఘాటుగా మాట్లాడాడు. దీనిపై తాజాగా సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ‘సెహ్వాగ్ అంతలా చెప్పిన తర్వాత.. ఇక నేను చెప్పడానికి ఏముంది. అతను చాలా మూర్ఖంగా మాట్లాడాడు’ అని అసహనం వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.