యాప్నగరం

రిటైర్మెంట్‌ మ్యాచ్‌లో ధోనీ సర్‌ప్రైజ్‌ని ఊహించలేదు: గంగూలీ

సౌరవ్ గంగూలీకి చేజారిన కెప్టెన్సీని రిటైర్మెంట్ మ్యాచ్‌లో గౌరవంగా అతనికి ధోనీ అప్పగించాడు. ఆస్ట్రేలియాపై ఆఖర్లో గంగూలీ అనధికార కెప్టెన్సీలోనే భారత్ విజయం సాధించింది.

Samayam Telugu 11 Jul 2020, 11:46 am
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తనకి రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుర్తుచేసుకున్నాడు. 2008లో నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కి సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆ మ్యాచ్‌ ఆఖర్లో 3-4 ఓవర్లు కెప్టెన్సీ చేయాల్సిందిగా ధోనీ కోరినట్లు గంగూలీ వెల్లడించాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో భారత్ 172 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Samayam Telugu MS Dhoni ,Sourav Ganguly
ధోనీ, గంగూలీ


రిటైర్మెంట్ మ్యాచ్‌ గురించి తాజాగా ఓపెనర్ మయాంక్ అగర్వాత్‌తో ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్’ ఛాట్ షోలో గంగూలీ మాట్లాడుతూ ‘‘నా చివరి టెస్టు మ్యాచ్ నాగ్‌పూర్‌లో ఆడాను. ఆరోజు మ్యాచ్‌లో ఆఖరి రోజు.. లాస్ట్ సెషన్. గార్డ్ హాఫ్ హానర్‌తో నా సహచరులు మైదానంలోకి నన్ను ఆహ్వానించారు. ఆ సెషన్ ఆఖర్లో కెప్టెన్ ధోనీ.. నన్ను కెప్టెన్‌గా జట్టుని నడిపించమని కోరాడు. నేను ఆ సర్‌ప్రైజ్‌ని ఊహించలేదు. ఆ మ్యాచ్‌లో భారత్ జట్టు గెలిచింది. కానీ.. నా మైండ్‌ మొత్తం రిటైర్మెంట్‌ ఆలోచనలతో నిండిపోయింది. కాబట్టి.. ఆ ఆఖరి 3-4 ఓవర్లలో కెప్టెన్‌గా ఎలా వ్యవహరించానో నాకు గుర్తులేదు’’ అని గంగూలీ వెల్లడించాడు.

భారత్ జట్టుకి దూకుడు నేర్పిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీకి పేరు. అతని కెప్టెన్సీలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. అయినప్పటికీ.. ధోనీకి వరుస అవకాశాలిచ్చిన గంగూలీ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.3లో పంపి మరీ ప్రోత్సహించాడు. దాంతో.. ధోనీ కూడా గంగూలీపై తన గౌరవాన్ని చాటుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.