యాప్నగరం

సఫారీ గడ్డపై హెల్మెట్‌కి తగిలేలా బౌన్సర్లు..!

దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ దాడి చాలా ప్రమాదకరంగా ఉంటుందని భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. వన్డే,

TNN 1 Jan 2018, 2:43 pm
దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ దాడి చాలా ప్రమాదకరంగా ఉంటుందని భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా వచ్చే రోహిత్.. టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో మీడియాతో రోహిత్ శర్మ సోమవారం మాట్లాడాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల బౌలింగ్ అటాక్‌తో పోలిస్తే.. సఫారీ జట్టే మెరుగైందని రోహిత్ వివరించాడు.
Samayam Telugu south africa attack most lethal believes rohit sharma
సఫారీ గడ్డపై హెల్మెట్‌కి తగిలేలా బౌన్సర్లు..!



‘ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా బౌలింగ్ అటాక్ అత్యుత్తమైనది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిలో పదునుంటుంది.. కానీ.. దక్షిణాఫ్రికా బౌలర్లు ఇంకా ప్రమాదకరం. యువ బౌలర్ కగిసో రబాడ బ్యాట్స్‌మెన్ హెల్మెట్‌కి తగిలేలా బౌన్సర్లు విసురుతున్నాడు. సఫారీ బౌలర్లలో వెరైటీ ఎక్కువగా కనిపిస్తుంది. రబాడతో పాటు సీనియర్ బౌలర్లు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ కొత్త బంతితోనే కాదు.. పాత బంతితోనూ బ్యాట్స్‌మెన్‌ని ఉక్కిరిబిక్కిరి చేయగలరు. ఫిలాండర్‌ కూడా వారి సొంతగడ్డపై ప్రమాదకర బౌలరే. అందుకే దక్షిణాఫ్రికా బౌలింగ్‌ని ఎదుర్కోవడం భారత్ జట్టుకి ఓ సవాల్’ అని రోహిత్ శర్మ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.