యాప్నగరం

​ ఫ్రీడం సిరీస్‌తో విరాట్ కోహ్లి, డుప్లెసిస్..!

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆసక్తికరమైన సిరీస్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత కాలమాన ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం

TNN 3 Jan 2018, 6:35 pm
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆసక్తికరమైన సిరీస్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత కాలమాన ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ ఫ్రీడం సిరీస్‌కి సంబంధించిన ట్రోఫీని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు.
Samayam Telugu south africa test series will be virat kohlis biggest challenge as captain till date
​ ఫ్రీడం సిరీస్‌తో విరాట్ కోహ్లి, డుప్లెసిస్..!


ఇప్పటి వరకు భారత్ జట్టు ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా సఫారీ గడ్డపై గెలవలేకపోయింది. అయితే.. గత ఏడాది ఆడిన అన్ని టెస్టు సిరీస్‌ల్లోనూ కోహ్లి సారథ్యంలోని భారత్ జట్టు గెలిచింది. ఈ నేపథ్యంలో సిరీస్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికా‌లో పర్యటించిన భారత జట్టు 0-1తో సిరీస్‌ చేజార్చుకుంది. అయితే.. గతంలో ఎన్నడూలేనంత సమతూకంగా ప్రస్తుతం టీమిండియా ఉందని.. ఈ జట్టుకి అక్కడ టెస్టు సిరీస్ గెలిచే సత్తా ఉందని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.