యాప్నగరం

మూడో టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు

TNN 24 Feb 2018, 9:16 pm
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు చెరొక టీ20లో గెలుపొందగా.. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టే విజేతగా నిలవనుండటంతో పోరు ఆసక్తికరంగా జరగనుంది. అయితే.. విశ్రాంతి పేరుతో విరాట్ కోహ్లి జట్టుకి దూరమవగా.. అతని స్థానంలో టాస్‌కి వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుమిని వరుసగా మూడు టీ20ల్లోనూ టాస్ గెలవడం విశేషం.
Samayam Telugu south africa vs india 3rd t20 south africa opt to bowl
మూడో టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా


భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో జట్టులోకి దినేశ్ కార్తీక్ రాగా.. రెండో టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న మణికట్టు స్పిన్నర్ చాహల్ స్థానంలో అక్షర్ పటేల్, ఉనద్కత్‌కి బదులుగా జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వచ్చారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ , సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, శార్ధూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.