యాప్నగరం

T20 World Cup: శ్రీలంక, బంగ్లాదేశ్‌కి డైరెక్ట్ ఎంట్రీ లేదు..!

2020, అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఎనిమిది జట్ల మధ్య క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు మరో ఆరు టీమ్స్‌ కూడా పోటీపడనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.

Samayam Telugu 1 Jan 2019, 4:47 pm
ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌కి శ్రీలంక, బంగ్లాదేశ్ టీమ్‌లు నేరుగా అర్హత సాధించలేకపోయాయి. ఈ మెగా టోర్నీలో పోటీపడే జట్లని మంగళవారం ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. డిసెంబరు 31, 2018 నాటికి టీ20 ర్యాంకింగ్స్ టాప్-8లో ఉన్న టీమ్స్‌ నేరుగా అర్హత సాధించినట్లు వెల్లడించింది.
Samayam Telugu prv_1546333074.


ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ని ఓసారి పరిశీలిస్తే.. పాకిస్థాన్ 138 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా భారత్ (126), ఇంగ్లాండ్ (118), ఆస్ట్రేలియా (117), దక్షిణాఫ్రికా (114), న్యూజిలాండ్ (112), వెస్టిండీస్ (101), అఫ్గానిస్థాన్ (92) టాప్-8లో నిలిచాయి. ఇక 9వ స్థానంలో శ్రీలంక 87 పాయింట్లతో ఉండగా.. 77 పాయింట్లతో బంగ్లాదేశ్ 10వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. దీంతో.. ఈ రెండు జట్లూ క్వాలిఫయర్స్‌లో గెలిచి టోర్నీలోకి ప్రవేశించాల్సిందేనని ఐసీసీ ప్రకటించింది.

2020, అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఎనిమిది జట్ల మధ్య క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు మరో ఆరు టీమ్స్‌ కూడా పోటీపడనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.