యాప్నగరం

వార్మప్‌ మ్యాచ్‌ ‘డ్రా’.. భారత్‌కి ఫుల్ ప్రాక్టీస్

వార్మప్ మ్యాచ్‌లో దొరికిన అవకాశాన్ని ఓపెనర్ అభినవ్ ముకుంద్ వృథా చేసుకున్నాడు. అతను ఎదుర్కొన్న తొలి బంతికే

TNN 22 Jul 2017, 5:14 pm
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి ముందు భారత్ జట్టుకి మంచి ప్రాక్టీస్ లభించింది. శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్ జట్టుతో జరిగిన రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌‌ శనివారం డ్రాగా ముగిసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (54: 58 బంతుల్లో 7x4), కెప్టెన్ విరాట్ కోహ్లి (53 రిటైర్డ్ ఔట్: 76 బంతుల్లో 8x4) అర్ధ శతకాలు బాదగా.. అజింక్య రహానె (40 రిటైర్డ్ ఔట్: 58 బంతుల్లో 3x4), శిఖర్ ధావన్ (41 రిటైర్డ్ ఔట్ : 48 బంతుల్లో 7x4), రోహిత్ శర్మ (38 రిటైర్డ్ ఔట్ : 49 బంతుల్లో 1x4, 2x6), సాహా (36 నాటౌట్: 40 బంతుల్లో 2x6) నిలకడగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. అంతకముందు శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 187 పరుగులకి ఆలౌటైంది. శ్రీలంకతో జులై 26 నుంచి తొలి టెస్టు ఆరంభంకానుంది.
Samayam Telugu sri lanka board presidents xi vs india
వార్మప్‌ మ్యాచ్‌ ‘డ్రా’.. భారత్‌కి ఫుల్ ప్రాక్టీస్


వార్మప్ మ్యాచ్‌లో దొరికిన అవకాశాన్ని ఓపెనర్ అభినవ్ ముకుంద్ వృథా చేసుకున్నాడు. అతను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటవగా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (12) నిరాశపరిచాడు. మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తడబడకుండా మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. మూడు వికెట్లు పడగొట్టి జడేజా అతనికి అండగా నిలిచాడు. పేసర్ మహ్మద్ షమీ రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్ అశ్విన్, పేసర్లు భువనేశ్వర్, ఉమేశ్, ఇషాంత్, హార్దిక్ పాండ్య నిరాశపరిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.