యాప్నగరం

భారత్ విజయంతో.. పట్టరాని ఆనందంలో లంక ఫ్యాన్స్ నాగినీ డ్యాన్స్!

ఓటమి అంచున భారత్ నిలిచిన వేళ.. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో ఒంటి చేత్తో దినేశ్ కార్తీక్ గెలిపించే తరుణాన లంక అభిమానులు ఉద్వేగంతో ఉగిపోయారు.

Samayam Telugu 19 Mar 2018, 12:03 am
నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ ఆఖరి బంతికి సిక్స్ బాది భారత్‌కు విజాయాన్ని అందించాడు. అతడు క్రీజ్‌లో అడుగుపెట్టే వరకూ బంగ్లాదేశ్ విజయంపై ధీమాతో ఉంది. కానీ వస్తూనే విధ్వంసం సృష్టించిన కార్తీక్.. కేవలం 8 బంతుల్లో 29 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. దినేశ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ ముక్కోణపు టోర్నీని సొంతం చేసుకుంది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో తీవ్ర ఉత్కంఠ మధ్య సిక్స్ బాదిన దినేశ్ కార్తీక్ ఒంటి చేత్తో టీమిండియాకు ట్రోఫీని అందించడంతో భారత్ కంటే మిన్నగా శ్రీలంక అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
Samayam Telugu sri lanka fans feels happy with india victory in nidahas trophy final vs bangaldesh
భారత్ విజయంతో.. పట్టరాని ఆనందంలో లంక ఫ్యాన్స్ నాగినీ డ్యాన్స్!


ఈ సిరీస్‌లో ఆద్యంతం శ్రీలంక, బంగ్లా ఆటగాళ్లు, అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో పోరు సాగింది. నాదస్వరాలు, నాగిని నృత్యాలతో ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. శ్రీలంక, బంగ్లా మధ్య జరిగిన చివరి టీ20లో ఇది తారాస్థాయికి చేరింది. థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకున్న బంగ్లా ఆటగాళ్లు లంకను గేలి చేశారు.



Led by Sri Lankan flag waving Percy Indian team did a lap of honour to the Sri Lankan R Premadasa stadium crowd who supported India against Bangladesh #INDvBAN pic.twitter.com/WZuChHpjJu — Azzam Ameen (@AzzamAmeen) March 18, 2018
దీంతో వారంతా ఫైనల్లో భారత్‌కు మద్దతు పలికారు. స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. మ్యాచ్ జరుగుతోంది కొలంబోలోనా.. కాన్పూర్‌లోనా అనేంతలా.. లంక ఫ్యాన్స్ భారత్‌‌కు సపోర్ట్ ఇచ్చారు. రోహిత్ ఆడుతున్నంత సేపు రోహిత్.. రోహిత్ అంటూ ఉత్సాహ పరిచారు. 18 ఓవర్లో ముస్తాఫిజుర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు లంక ఫ్యాన్స్ షాకయ్యారు. చివర్లో దినేశ్ కార్తీక్ హిట్టింగ్‌ చేస్తున్నప్పుడు తమవాడే ఆడుతున్నంతగా ఉత్సాహపరిచారు. ఆఖరి బంతికి భారత్ గెలవడంతో.. లంక గెలిచిందా..? అనేంతలా సంబరాలు చేసుకున్నారు.

Sri lanka looking more happy than india #INDvBAN#NidhasTrophy pic.twitter.com/aEtDu98FYP — Ajay Devgn Mania (@AjayDevgnMania) March 18, 2018
మరోవైపు చివరి బంతి వరకూ అద్భుతంగా పోరాడినప్పటికీ ఓడటంతో బంగ్లా ఆటగాళ్లు నైరాశ్యంలో కూరుకుపోయారు. వారి కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. స్టేడియంలోని బంగ్లా ఫ్యాన్స్ హతాశయులయ్యారు. బంగ్లా పోరాటంతో ఆకట్టుకోగా.. దినేశ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌‌ను గెలిపించడంతో లంక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.