యాప్నగరం

IND vs SL 3rd T20కి గాయంతో బౌలర్ ఔట్

రెండో టీ20లో పేలవ ఓటమితో ఇప్పటికే ఢీలాపడిన శ్రీలంక జట్టుకి మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉసురు ఉదాన గాయంతో మూడో టీ20కి దూరమయ్యాడు. పుణె వేదికగా శుక్రవారం రాత్రి మ్యాచ్ జరగనుంది.

Samayam Telugu 8 Jan 2020, 2:20 pm
భారత్‌తో కీలకమైన మూడో టీ20 ముంగిట శ్రీలంక జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పి గాయంతో ఆ జట్టు అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ ఇసురు ఉదాన టీమ్ నుంచి తప్పుకున్నాడు. ఇండోర్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆడిన ఉదాన.. బ్యాటింగ్‌లో 2 బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే.. మ్యాచ్‌లో శ్రీలంక ఫీల్డింగ్‌కి వచ్చే ముందు జరిగిన చిన్న వార్మప్ సెషన్‌లో అతను గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో.. అతను ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్ చేయలేదు.
Samayam Telugu Leeds: Sri Lankas Isuru Udana holds up the ball after dismissing Englands capt...


భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ జరుగుతుండగా.. ఇప్పటికే గువాహటిలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత ఇండోర్ టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి సిరీస్‌ని సమం చేయాలని లంకేయులు ఆశిస్తున్నారు. కానీ.. ఫాస్ట్ బౌలర్ ఉదాన జట్టుకి దూరమవడం ఇప్పుడు ఆ టీమ్‌లో కంగారు పెంచుతోంది. ఇండోర్ టీ20లో లంక ఓటమికి ఉదాన గాయంతో బౌలింగ్‌కి దూరంగా ఉండటం కూడా ఓ కారణమేనని స్వయంగా కెప్టెన్ లసిత్ మలింగ చెప్పుకొచ్చాడు.

సిరీస్‌లో మిగిలిన మూడో టీ20 మ్యాచ్ పుణె వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి జరగనుంది. ఇప్పటికే ఇండోర్ నుంచి బయల్దేరిన ఇరు జట్ల ఆటగాళ్లు.. ఈరోజు రెస్ట్ తీసుకుని గురువారం పుణెలో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. భారత్ గడ్డపై చివరిగా ఆడిన 6 టీ20ల్లోనూ టీమిండియా చేతిలో ఓడిన శ్రీలంక.. గత దశాబ్దకాలంలో ఒక్కసారి కూడా ద్వైపాక్షిక సిరీస్‌ గెలవలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.