యాప్నగరం

భారత్ చేతిలో ఓడిన శ్రీలంక లక్కీ..?

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో శ్రీలంక కొద్దిలో జరిమానా వేటు నుంచి తప్పించుకుంది. టోర్నీలో భాగంగా

TNN 6 Jul 2017, 6:01 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో శ్రీలంక కొద్దిలో జరిమానా వేటు నుంచి తప్పించుకుంది. టోర్నీలో భాగంగా భారత్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నిర్దేశించిన సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్‌ని శ్రీలంక జట్టు తక్కువగా వేసింది. దీంతో స్లో ఓవర్ రేట్ తప్పిదాన్ని గుర్తించిన ఐసీసీ మ్యాచ్ రిఫరీ.. జరిమానా విధించకుండా శ్రీలంక కెప్టెన్‌ ఇనోకా రణవీరని హెచ్చరించి వదిలేశారు. టోర్నీలో మరోసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడితే.. కెప్టెన్‌గా ఒక మ్యాచ్ నిషేధం వేటుకి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
Samayam Telugu sri lanka guilty of slow over rate in match against india
భారత్ చేతిలో ఓడిన శ్రీలంక లక్కీ..?


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనలో తడబడిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 216 పరుగులకే పరిమితమైంది. దీంతో టోర్నీలో వరుసగా నాలుగో విజయం అందుకున్న భారత్ సెమీస్‌కి చేరువైంది. దక్షిణాఫ్రికాతో శనివారం భారత్ తర్వాత మ్యాచ్‌లో ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. పురుషుల క్రికెట్లో స్లో ఓవర్ రేట్ తప్పిదానికి జరిమానా మినహాయింపు ఉండదు. ఒక ఓవర్ అయితే.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం, కెప్టెన్‌కి 20 శాతం.. రెండు ఓవర్లు అయితే.. రెట్టింపు ఫీజు కోత ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.