యాప్నగరం

ప్రపంచకప్‌ ఫైనల్.. క్రికెటర్ 50 సిగరెట్లు

భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్ ఫిక్సయ్యిందంటూ వస్తున్న ఆరోపణలకి బలం చేకూర్చే విషయాలు

TNN 19 Jul 2017, 6:27 pm
భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్ ఫిక్సయ్యిందంటూ వస్తున్న ఆరోపణలకి బలం చేకూర్చే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ ఈ ఫిక్సింగ్ వివాదాన్ని తెరపైకి తీసుకురాగా.. దీనిపై ఆ దేశ క్రీడల మంత్రి దయసిరి జయశేఖర స్పందించారు. ఆ మ్యాచ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే.. విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu sri lanka sports minister willing to probe 2011 world cup final
ప్రపంచకప్‌ ఫైనల్.. క్రికెటర్ 50 సిగరెట్లు


ఈ చర్చ నడుస్తుండగానే.. ఆ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వాంఖడే స్టేడియంలో వీక్షించిన అప్పటి క్రీడల మంత్రి మహినంద కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాడు. అప్పటి శ్రీలంక జట్టు మేనేజర్ తన రిపోర్ట్‌లో కొన్ని అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించాడని వెల్లడించారు. మ్యాచ్ జరుగుతుండగా.. డ్రెస్సింగ్ రూములో ఒక సీనియర్ క్రికెటర్ దాదాపు 50 సిగరెట్లు వరకు తాగి పడేసినట్లు రిపోర్ట్‌లో వెల్లడించినట్లు ఆయన వివరించాడు. ఫైనల్‌ కోసం తుది జట్టులో కెప్టెన్ అనూహ్యంగా నాలుగు మార్పులు చేయడంపై ఇప్పటికే రణతుంగ అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.