యాప్నగరం

పసికూనపై చెమటోడ్చి గెలిచిన శ్రీలంక

పసికూన జింబాబ్వే‌కి సొంతగడ్డపై వన్డే సిరీస్‌ కోల్పోయి పరువు పోగొట్టుకున్న శ్రీలంక జట్టుకి ఉపశమనం కలిగించే విజయం.

TNN 18 Jul 2017, 5:31 pm
పసికూన జింబాబ్వే‌కి సొంతగడ్డపై వన్డే సిరీస్‌ కోల్పోయి పరువు పోగొట్టుకున్న శ్రీలంక జట్టుకి ఉపశమనం కలిగించే విజయం. కొలంబో వేదికగా జరిగిన ఏకైక టెస్టులో డిక్వెల్లా (81: 118 బంతుల్లో 6x4), గుణరత్నే (80 నాటౌట్: 151 బంతుల్లో 6x4) అర్ధ శతకాలు బాదడంతో శ్రీలంక 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 388 పరుగుల లక్ష్య ఛేదనలో ఆటలో చివరి రోజైన మంగళవారం 170/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 203/5తో ఇబ్బందుల్లో పడింది.
Samayam Telugu sri lanka to victory on day 5 of zimbabwe test at colombo
పసికూనపై చెమటోడ్చి గెలిచిన శ్రీలంక


ఐదు వన్డేల సిరీస్‌ని 3-2తో చేజిక్కించుకున్న జింబాబ్వే ఈ టెస్టులో కూడా అద్భుతం చేసేలా కనిపించింది. కానీ.. డిక్వెల్లా, గుణతిలక జోడి సమన్వయంతో బ్యాటింగ్ చేసి.. ఆరో వికెట్‌కి 121 పరుగులు జతచేయడంతో శ్రీలంక ఊపిరి పీల్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 356 పరుగులు చేయగా.. అనంతరం శ్రీలంక 346 పరుగులకి ఆలౌటైంది. దీంతో 10 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులు చేయగా.. శ్రీలంక 391/6తో విజయాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా గుణరత్నే నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా స్పిన్నర్ హెరాత్ నిలిచాడు. సొంతగడ్డపై టెస్టుల్లో లంకేయులకి ఇదే అత్యధిక రికార్డు ఛేదన. జులై 26 నుంచి భారత్ జట్టుతో శ్రీలంక టెస్టు సిరీస్ ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.