యాప్నగరం

కోహ్లి, ధోనీ లేని భారత్‌ను ఓడించండి..!

శ్రీలంక వేదికగా మంగళవారం నుంచి ప్రారంభంకానున్న ముక్కోణపు టీ20 టోర్నీలో శ్రీలంక జట్టు ఫేవరెట్ అని ఆ దేశ దిగ్గజ

TNN 6 Mar 2018, 1:51 pm
శ్రీలంక వేదికగా మంగళవారం నుంచి ప్రారంభంకానున్న ముక్కోణపు టీ20 టోర్నీలో శ్రీలంక జట్టు ఫేవరెట్ అని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మహేల జయవర్దనె అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో శ్రీలంకతో పాటు భారత్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ప్రతి జట్టూ.. మిగిలిన రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్, ఆ తర్వాత కీలకమైన ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో.. భారత సెలక్టర్లు కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాలకి విశ్రాంతినిచ్చి యువ క్రికెటర్లకి అవకాశం కల్పించారు. దీంతో బలహీనంగా ఉన్న భారత్‌ను శ్రీలంక టోర్నీలో ఓడించగలదని జయవర్దనె విశ్వాసం వ్యక్తం చేశాడు.
Samayam Telugu sri lanka tri series favourites but india dangerous mahela jayawardene
కోహ్లి, ధోనీ లేని భారత్‌ను ఓడించండి..!


‘కొలంబో వేదికగానే టోర్నీ మొత్తం జరగనుండటం శ్రీలంకకి కలిసొచ్చే అంశం. కోచ్ చండికా హతురసిన్హా పర్యవేక్షణలో శ్రీలంక పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు టీమిండియా సీనియర్ల సేవల్ని కోల్పోయి బలహీనంగా కనిపిస్తోంది. కాబట్టి.. టోర్నీలో ఇప్పుడు శ్రీలంకనే ఫేవరెట్‌ అని నా భావన. కానీ.. భారత్‌ జట్టు ఎప్పుడూ ప్రమాదకర జట్టే.. ఇటీవల కాలంలో ఆ జట్టు టీ20ల్లో అద్భుతమైన విజయాల్ని అందుకుంది’ అని జయవర్దనె వివరించాడు. శ్రీలంక జట్టు కూడా సీనియర్ క్రికెటర్లు మాథ్యూస్, అసెల గుణరత్నె సేవల్ని కోల్పోయింది. అయితే.. భారత్ జట్టుకి దూరమైన ఆటగాళ్లతో పోలిస్తే.. ఇది చాలా తక్కువని.. అందుకే టోర్నీలో టీమిండియాని శ్రీలంక ఓడించగలదని మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.