శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లంకేయుల్ని వారి సొంతగడ్డపైనే ఇప్పటికే టెస్టుల్లో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్లోనూ అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుండగా.. టెస్టుల్లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని భారత్కి గట్టి పోటీనివ్వాలని శ్రీలంక ఆశిస్తోంది. కొత్త కెప్టెన్ ఉపుల్ తరంగ లంక జట్టుని ఈ వన్డే నుంచి నడిపించునున్నాడు. ఈ సుదీర్ఘ సిరీస్లో కోహ్లి టాస్ నెగ్గడం ఇది వరుసగా నాలుగోసారి.
భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మహేంద్రసింగ్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, చాహల్
శ్రీలంక: డిక్వెల్లా, గుణతిలక, కుశాల్ మెండిస్, ఉపుల్ తరంగ, మాథ్యూస్, కపుగెదర, హసరంగ, తిసార పెరీరా, సండకన్, విశ్వ, లసిత్ మలింగ
భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మహేంద్రసింగ్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, చాహల్
శ్రీలంక: డిక్వెల్లా, గుణతిలక, కుశాల్ మెండిస్, ఉపుల్ తరంగ, మాథ్యూస్, కపుగెదర, హసరంగ, తిసార పెరీరా, సండకన్, విశ్వ, లసిత్ మలింగ