యాప్నగరం

ప్రదీప్‌కి 5 వికెట్లు.. 500 దాటిన భారత్

గాలెలో శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్టులో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు.

TNN 27 Jul 2017, 12:52 pm
గాలెలో శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్టులో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. 399/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ లంచ్ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు తొలి సెషన్ ప్రారంభమైన కొంత సేపటికే కీలకమైన ఛటేశ్వర పుజారా(153), ఆజింక్య రహానె(57) వికెట్లను భారత్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ (47) దూకుడుగా ఆడగా.. సాహా(16) ఆతిచూచి ఆడాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 59 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Samayam Telugu sri lanka vs india 2nd test pradeep bags five but india cross 500
ప్రదీప్‌కి 5 వికెట్లు.. 500 దాటిన భారత్


ఈ క్రమంలో 115 ఓవర్లో హెరాత్‌కి సాహా చిక్కాడు. పెరీరాకి క్యాచ్‌ ఇచ్చి సాహా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ప్రదీప్‌ బౌలింగ్‌లో అశ్విన్.. కీపర్ డిక్వెల్లాకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 50వ టెస్టు ఆడుతోన్న అశ్విన్‌ తృటిలో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో పాండ్య(4), జడేజా(8) ఉన్నారు. పాండ్యాకి కెరీర్‌లో ఇది తొలి టెస్టు. కాగా, లంచ్ విరామానికి భారత్ 7 వికెట్ల నష్టపోయి 503 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్ ప్రదీప్ 5 వికెట్లు పడగొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.