యాప్నగరం

వర్షంతో చివరి వన్డే టాస్ ఆలస్యం..!

భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా ఆదివారం మధ్యాహ్నం (2.30 గంటలకి) జరగాల్సిన చివరి వన్డే వర్షం కారణంగా

TNN 3 Sep 2017, 2:12 pm
భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా ఆదివారం మధ్యాహ్నం (2.30 గంటలకి) జరగాల్సిన చివరి వన్డే వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. ఉదయం నుంచి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినా.. చిరుజల్లు పలకరిస్తుండటంతో టాస్ ఆలస్యం కానుంది.
Samayam Telugu sri lanka vs india 5th odi toss delayed due to steady drizzle
వర్షంతో చివరి వన్డే టాస్ ఆలస్యం..!


ఐదు వన్డేల సిరీస్‌లో తిరుగులేని ప్రదర్శనతో భారత్ ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో నిలిచి క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. సొంతగడ్డపై ఇప్పటి వరకు గెలుపు రుచి ఎరుగని శ్రీలంక కనీసం ఈ ఐదో వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది. తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో భారత్‌కి వచ్చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌కి దూరంకానున్నాడు. అతని స్థానంలో అజింక్య రహానె తుదిజట్టులోకి వచ్చే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.