యాప్నగరం

ధోనీ 300వ వన్డే.. భారత్ జట్టులో 3 మార్పులు..!

శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌‌లో ఇప్పటికే 3-0తో ఆధిక్యం సాధించిన భారత్ జట్టు గురువారం జరుగుతున్న నాలుగో

TNN 31 Aug 2017, 2:27 pm
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌‌లో ఇప్పటికే 3-0తో ఆధిక్యం సాధించిన భారత్ జట్టు గురువారం జరుగుతున్న నాలుగో వన్డేకి తుది జట్టులో మూడు మార్పులు చేసింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కి విశ్రాంతినివ్వగా అతని స్థానంలో యువ పేసర్ శార్ధూల్ ఠాకూర్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. మిడిలార్డర్‌లో టోర్నీ ఆరంభం నుంచి విఫలమవుతున్న కేదార్ జాదవ్‌పై వేటు వేసిన కెప్టెన్ కోహ్లి.. మనీశ్ పాండేకి ఛాన్సిచ్చాడు. మరో స్పిన్నర్ చాహల్‌కి విశ్రాంతినివ్వగా అతని స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కింది. ఈ వన్డేతో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ కెరీర్‌లో 300వ వన్డే మైలురాయిని అందుకున్నాడు.
Samayam Telugu sri lanka vs india dhoni is playing his 300th odi
ధోనీ 300వ వన్డే.. భారత్ జట్టులో 3 మార్పులు..!


భారత్ జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, శార్ధూల్ ఠాకూర్

మరోవైపు ఆతిథ్య శ్రీలంక కూడా జట్టులో మూడు మార్పులు చేసింది. ఇప్పటికే పేలవ ప్రదర్శనతో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆ జట్టు కనీసం ఈ వన్డేలోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతోంది.

శ్రీలంక జట్టు: డిక్వెల్లా, దిల్షాన్ మునవీరా, కుశాల్ మెండిస్, తిరుమానె, మాథ్యూస్, సిరివర్దనె, హసరంగ, ధనంజయ, పుష్పకుమార, విశ్వ, మలింగ (కెప్టెన్ )

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.