యాప్నగరం

లంకతో ఏకైక టీ20లో భారత్ టార్గెట్ 171

సొంతగడ్డపై లంకేయులు తొలిసారి సిరీస్‌లో టీమిండియాకి సవాల్ విసిరారు. కొలంబో వేదికగా

TNN 6 Sep 2017, 9:30 pm
సొంతగడ్డపై లంకేయులు తొలిసారి సిరీస్‌లో టీమిండియాకి సవాల్ విసిరారు. కొలంబో వేదికగా బుధవారం జరుగుతున్న ఏకైక టీ20 మ్యాచ్‌లో దిల్షాన్ మునవీరా (53: 29 బంతుల్లో 5x4, 4x6) అర్ధ శతకం బాదడంతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ల దూకుడుతో ఆరంభంలోనే లయ తప్పిన భారత బౌలర్లు మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. చివర్లో అషాన్ ప్రియంజన్ (40 నాటౌట్: 40 బంతుల్లో 1x4, 2x6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో శ్రీలంక మెరుగైన స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో చాహల్ 3 వికెట్లు, కుల్దీప్ రెండు, భువనేశ్వర్, బుమ్రా చెరో వికెట్ తీశారు.
Samayam Telugu sri lanka vs india priyanjan lifts sri lanka to 170
లంకతో ఏకైక టీ20లో భారత్ టార్గెట్ 171


టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత శ్రీలంకని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సిరీస్‌లో ఇప్పటి వరకు గెలుపు రుచి ఎరుగని లంకేయుల.. ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఓపెనర్ డిక్వెల్లా (17: 14 బంతుల్లో 3x4) బుమ్రాని లక్ష్యం చేసుకుని వరుస బౌండరీలు బాదేయగా.. మరో ఓపెనర్ ఉపుల్ తరంగ (5) హిట్టింగ్ చేసే ప్రయత్నంలో క్లీన్‌ బౌల్డయ్యాడు. అయితే.. అనంతరం వచ్చిన మునవీరా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. ఏ మాత్రం జోరు తగ్గించలేదు. ఈ క్రమంలోనే అర్ధ శతకం పూర్తిచేసుకుని అతను ఔటయ్యాడు. మధ్యలో మాథ్యూస్ (7), తిసార పెరీరా (11), శనక (0) నిరాశపరిచినా.. చివర్లో ప్రియంజన్‌, ఉదాన (19 నాటౌట్: 10 బంతుల్లో 2x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో శ్రీలంక మెరుగైన స్కోరు చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.