శ్రీలంక జట్టుని దాని సొంతగడ్డపైనే టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. కొలంబో వేదికగా తాజాగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్లో 121 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా టీమ్ 14.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. దాంతో.. మూడు టీ20ల సిరీస్ని 3-0తో సఫారీలు చేజిక్కించుకోగా.. అంతకముందు జరిగిన మూడు వన్డేల సిరీస్ని శ్రీలంక 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. టీమ్లో ఓపెనర్ కుశాల్ పెరీరా (39: 33 బంతుల్లో 3x4) టాప్ స్కోరర్గా నిలవగా.. చివర్లో కరుణరత్నె (24: 19 బంతుల్లో 2x6) విలువైన పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా టీమ్లో రబాడ, ఫార్చూన్ చెరో రెండు, మర్క్రమ్, మహరాజ్, ముల్డర్ తలో వికెట్ తీశారు.
121 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు హెండ్రిక్స్ (56 నాటౌట్: 42 బంతుల్లో 5x4, 1x6), డికాక్ (59 నాటౌట్: 46 బంతుల్లో 7x4) దూకుడుగా ఆడేశారు. శ్రీలంక బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడి చేసిన ఈ ఓపెనింగ్ జోడీ.. హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకోవడంతో పాటు తొలి వికెట్కి అజేయంగా 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ మ్యాచ్తో లంక గడ్డపై దక్షిణాఫ్రికా పర్యటన ముగిసింది.
121 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు హెండ్రిక్స్ (56 నాటౌట్: 42 బంతుల్లో 5x4, 1x6), డికాక్ (59 నాటౌట్: 46 బంతుల్లో 7x4) దూకుడుగా ఆడేశారు. శ్రీలంక బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడి చేసిన ఈ ఓపెనింగ్ జోడీ.. హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకోవడంతో పాటు తొలి వికెట్కి అజేయంగా 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ మ్యాచ్తో లంక గడ్డపై దక్షిణాఫ్రికా పర్యటన ముగిసింది.