యాప్నగరం

పసికూనపై 310 లక్ష్యాన్ని ఊదేశారు..!

ఛేదనలో తొలి వికెట్‌కి అభేద్యంగా 37 ఓవర్లలోనే 229 పరుగుల భాగస్వామ్యాన్ని శ్రీలంక ఓపెనర్లు నెలకొల్పారు. దీంతో మ్యాచ్‌పై

TNN 6 Jul 2017, 6:54 pm
సొంతగడ్డపై శ్రీలంక జోరు కొనసాగుతోంది. జింబాబ్వేతో గురువారం జరిగిన మూడో వన్డేలో ఆ జట్టు 310 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ మసకద్జ (111: 98 బంతుల్లో 15x4, 1x6) శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్లు డిక్వెల్లా (102: 116 బంతుల్లో 14x4), గుణతిలక (116: 111 బంతుల్లో 15x4, 1x6) శతకాలు కొట్టడంతో శ్రీలంక 47.2 ఓవర్లలోనే 312/2తో విజయాన్ని అందుకుంది.
Samayam Telugu sri lanka vs zimbabwe 2017
పసికూనపై 310 లక్ష్యాన్ని ఊదేశారు..!


ఛేదనలో తొలి వికెట్‌కి అభేద్యంగా 37 ఓవర్లలోనే 229 పరుగుల భాగస్వామ్యాన్ని శ్రీలంక ఓపెనర్లు నెలకొల్పారు. దీంతో మ్యాచ్‌పై శ్రీలంక పట్టు బిగించేసింది. కానీ.. 8 పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లు ఔటైనా.. తర్వాత కుశాల్ మెండిస్ (28 నాటౌట్), ఉపుల్ తరంగ (44 నాటౌట్: 32 బంతుల్లో 3x4, 2x6) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. తొలి వన్డేలో జింబాబ్వే గెలవగా.. తర్వాత రెండు వన్డేల్లోను గెలిచిన శ్రీలంక ఐదు వన్డేల సిరీస్‌లో 2-1‌తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే శనివారం జరగనుంది. ‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.