యాప్నగరం

వరల్డ్‌కప్‌లో శ్రీలంక ఓటమి ఖాయం..!: రణతుంగ

శ్రీలంక క్రికెట్ బోర్డులో అవినీతి పెరిగిపోయింది. దీంతో.. ఆటగాళ్లలోనూ నైతికత దెబ్బతింది. ఎంతలా అంటే.. టీమ్‌లోని ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోట్లాడుకుంటున్నారు. -మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ

Samayam Telugu 1 Feb 2019, 7:58 pm
ఇంగ్లాండ్ వేదికగా మే నెల చివరి వారంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కనీసం తొలి రౌండ్‌ని కూడా దాటలేదని ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం టీమ్‌లోని ఆటగాళ్లలో క్రమశిక్షణ కొరవడిందని చెప్పుకొచ్చిన ఆయన.. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించాడు. 1996 ప్రపంచకప్‌లో అర్జున రణతుంగ కెప్టెన్సీలోనే శ్రీలంక జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Samayam Telugu 75674-irhcvwiarw-1512457204


తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న శ్రీలంక.. తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడి.. రెండో టెస్టులోనూ తొలి రోజైన శుక్రవారం ఆస్ట్రేలియా ఓపెనర్ జో బర్న్స్ (172 బ్యాటింగ్: 243 బంతుల్లో 26x4), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ (161: 204 బంతుల్లో 21x4, 1x6) భారీ శతకాలు బాదడంతో 384 పరుగులు సమర్పించుకుంది.

‘శ్రీలంక క్రికెట్ బోర్డులో అవినీతి పెరిగిపోయింది. దీంతో.. ఆటగాళ్లలోనూ నైతికత దెబ్బతింది. ఎంతలా అంటే.. టీమ్‌లోని ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోట్లాడుకుంటున్నారు. వారు తాము దేశానికి ఆడటం కంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడేందుకే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి.. ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు మొదటి రౌండ్‌లోనే ఓడి ఇంటిబాట పట్టడం ఖాయం’ అని అర్జున్ రణతుంగ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.