యాప్నగరం

​ లాహోర్‌ మ్యాచ్‌కి మంత్రిగారు కూడా..!

లాహోర్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కి శ్రీలంక క్రీడల మంత్రి కూడా వెళ్లనున్నాడు. భద్రతా కారణాలతో

TNN 25 Oct 2017, 8:21 pm
లాహోర్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కి శ్రీలంక క్రీడల మంత్రి కూడా వెళ్లనున్నాడు. భద్రతా కారణాలతో అక్కడికి వెళ్లేందుకు చాలా మంది శ్రీలంక సీనియర్ క్రికెటర్లు నిరాకరిస్తుండటంతో.. వారిని పక్కకి తప్పించి జట్టుని ఇటీవల సెలక్టర్లు ప్రకటించారు. అయినప్పటికీ.. క్రికెటర్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో స్వయంగా క్రీడల మంత్రి దయసిరి జయశేఖర ఆటగాళ్లతో కలిసి లాహోర్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబరు 29న లాహోర్‌లో ఈ టీ20 మ్యాచ్ జరగనుంది.
Samayam Telugu sri lankas sports minister to travel with national team for final t20i at lahore
​ లాహోర్‌ మ్యాచ్‌కి మంత్రిగారు కూడా..!


2009‌లో లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్పటి నుంచి పాకిస్థాన్ పర్యటనకి శ్రీలంక వెళ్లడం లేదు. తాజాగా టీ20 మ్యాచ్‌కి వెళ్లేందుకు కూడా.. కెప్టెన్ ఉపుల్ తరంగ, లసిత్ మలింగ, డిక్వెల్లా తదితర సీనియర్ క్రికెటర్లు నిరాకరించారు. దీంతో వారి స్థానంలో వేరే ఆటగాళ్లని ఎంపిక చేసి జట్టుని ప్రకటించారు. పాకిస్థాన్‌లో భద్రతపై ఐసీసీతో పాటు శ్రీలంక క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని.. అయినప్పటికీ క్రికెటర్లు భయపడుతుండటంతో మంత్రి లాహోర్‌కి వెళ్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.