యాప్నగరం

ధోనీ క్రీజులో ఉంటే.. ఆ బంతులేస్తావా..?

ఆ ఓవర్‌లో మూడు నోబాల్స్‌తో పాటు.. మూడు ఫోర్లను విండీస్ కెప్టెన్ సమర్పించుకున్నాడు.

TNN 26 Jun 2017, 7:09 pm
పేలవ బౌలింగ్ ప్రదర్శనతో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన విండీస్‌పై ఆ జట్టు ప్రధాన కోచ్ స్టువర్ట్ లా అసహనం వ్యక్తం చేశాడు. ధోనీ లాంటి ఫినిషర్ క్రీజులో ఉంటే అనూహ్యంగా నోబాల్స్ విసిరి భారత్‌కి భారీ స్కోరు కట్టబెట్టారని.. అనుభవం లేని విండీస్ బ్యాట్స్‌మెన్‌కి ఆ స్కోరు ఛేదించడం సాధ్యంకాలేదని వివరించాడు. వర్షం కారణంగా 43 ఓవర్లకి కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో విండీస్ 205/6కే పరిమితమైన విషయం తెలిసిందే.
Samayam Telugu stuart law rues abject bowling performance for defeat
ధోనీ క్రీజులో ఉంటే.. ఆ బంతులేస్తావా..?


మ్యాచ్‌లో నోబాల్స్ కారణంగా హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్‌కి ఒక్కోసారి జీవనదానం లభించింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేసిన విండీస్ కెప్టెన్ హోల్డర్ మూడు నోబాల్స్ విసిరి ఆశ్చర్యపరిచాడు. 42 ఓవర్లు ముగిసే సమయానికి 288/5తో నిలిచిన భారత్ చివరికి 300 పరుగులు చేయడం కష్టమేనని అంతా భావించారు. అప్పటికి క్రీజులో ఉన్న ధోనీ, జాదవ్ ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోవడమే దీనికి కారణం. కానీ.. హోల్డర్ పేలవ బౌలింగ్‌తో చివరి ఓవర్‌లో ఏకంగా 22 పరుగులను భారత్ రాబట్టగలిగింది. ఆ ఓవర్‌లో మూడు నోబాల్స్‌తో పాటు.. మూడు ఫోర్లను విండీస్ కెప్టెన్ సమర్పించుకున్నాడు.

‘మ్యాచ్ ఆరంభం నుంచి విండీస్‌కి కలిసిరాలేదు. మా బౌలర్లు లయ తప్పారు. బంతితో మెరుగైన ప్రదర్శన చేసుండాల్సింది. భారత్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఓడించాలంటే బౌలర్లు క్రమశిక్షణతో బంతులు వేయాలి. మా ప్రణాళికలు అన్నీ వృథా అయ్యాయి. మూడో వన్డేలో గట్టి పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని స్టువర్ట్ లా ధీమా వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.