యాప్నగరం

పుజారా, అశ్విన్‌పై గవాస్కర్ విమర్శలు

శ్రీలంకతో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో భారత్ ఆటగాళ్లు పుజారా, అశ్విన్ తమ పేలవ కదలికలతో

TNN 7 Dec 2017, 1:14 pm
శ్రీలంకతో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో భారత్ ఆటగాళ్లు పుజారా, అశ్విన్ తమ పేలవ కదలికలతో మైదానంలో నిరాశపరిచారని మాజీ క్రికెట్ సునీల్ గవాస్కర్ ఘాటు విమర్శలు చేసినట్లు గురువారం వెలుగులోకి వచ్చింది. ఆటలో చివరి రోజైన బుధవారం శ్రీలంక వికెట్లు పడగొట్టడంలో భారత్ బౌలర్లు విఫలమయ్యారని.. ఫీల్డింగ్‌లో కోహ్లి, జడేజా మినహా ఎవరూ చురుగ్గాలేరన్నాడు. బుధవారం 87 ఓవర్లు బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు 2 వికెట్లు మాత్రమే పడగొట్టడంతో చివరికి మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
Samayam Telugu sunil gavaskar feels pujara and ashwin are like cars running with handbrakes on
పుజారా, అశ్విన్‌పై గవాస్కర్ విమర్శలు


ఈ టెస్టు మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన సునీల్ గవాస్కర్.. మ్యాచ్ గమనాన్ని వివరిస్తూ పుజారా, అశ్విన్‌ల ఫీల్డింగ్‌ కదలికలపై పెదవి విరించాడు. ‘మైదానంలో పుజారా కదలిక.. కారుకి హ్యాండ్‌ బ్రేక్ వేసి నడిపినట్లు ఉంది’ అని విమర్శించాడు. అశ్విన్ గురించి మాట్లాడుతూ ‘వికెట్లు తీయాలని తాపత్రయపడుతున్నాడు. కానీ.. సఫలం కాలేకపోతున్నాడు’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.