యాప్నగరం

IPL 2020 ముంగిట డేవిడ్ వార్నర్ వీసా రిజక్ట్

ఐపీఎల్ 2020 సీజన్‌ ముంగిట కేన్ విలియమ్సన్‌ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అతని స్థానంలో మళ్లీ డేవిడ్ వార్నర్‌కి బాధ్యతలు అప్పగించింది. కానీ.. వార్నర్ వీసా తాజాగా రిజక్ట్ అయ్యింది.

Samayam Telugu 13 Mar 2020, 2:42 pm
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఈ ఏడాది ఐపీఎల్ జరగడంపై అనుమానాలు నెలకొనగా.. తాజాగా సన్‌రైజర్స్ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వీసా రిజక్ట్ అయ్యింది. దీంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది.
Samayam Telugu Sunrisers Hyderabad captain David Warner


Read More; ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధం..!

వాస్తవానికి మార్చి 13 నుంచి పర్యాటక వీసాల్ని భారత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏప్రిల్ 15 వరకూ అత్యవసరం అయితే తప్ప విదేశీయుల్ని భారత్‌లోకి అనుమతించొద్దని అధికారుల్ని ఆదేశించిన ప్రభుత్వం.. ఒకవేళ ఎవరైనా విదేశాల నుంచి భారత్‌కి రావాలంటే ముందుగా ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. అక్కడ వారి ఆరోగ్య పరిస్థితిని 14 రోజుల పాటు పరీక్షించి ఆ తర్వాత వీసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. వార్నర్‌ వీసా రిజక్ట్‌కి అసలు కారణం ఏంటో..? ఇంకా తెలియడం లేదు.

Read More: undefined
మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకావాల్సి ఉండగా.. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించబోమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఇక దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 78కి చేరుకోగా.. అనుమానితులు వందల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా మ్యాచ్‌లు నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీసీఐకి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.