Sunrisers Hyderabad Indian Premier League 2020 Complete Team Players List
SRH Squad: ఐపీఎల్ 2020కి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే
ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రూ. 17 కోట్లతో వేలంలోకి వచ్చినప్పటికీ.. సీనియర్, స్టార్ క్రికెటర్ల జోలికి వెళ్లని సన్రైజర్స్ ఫ్రాంఛైజీ.. యువ క్రికెటర్లని కొనుగోలు చేయడం ద్వారా జట్టులో సమతూకం తెచ్చే ప్రయత్నం చేసింది. భారత్ అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్ తదితరుల్ని కొనుగోలు చేయడం ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేసింది. వేలంలో కేవలం ఏడుగుర్ని మాత్రమే కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. రూ. 6.90 కోట్లతో అత్యంత తక్కువగా వేలంలో వెచ్చించిన ఫ్రాంఛైజీగా నిలిచింది.
Samayam Telugu20 Dec 2019, 5:09 pm
ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రూ. 17 కోట్లతో వేలంలోకి వచ్చినప్పటికీ.. సీనియర్, స్టార్ క్రికెటర్ల జోలికి వెళ్లని సన్రైజర్స్ ఫ్రాంఛైజీ.. యువ క్రికెటర్లని కొనుగోలు చేయడం ద్వారా జట్టులో సమతూకం తెచ్చే ప్రయత్నం చేసింది. భారత్ అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్ తదితరుల్ని కొనుగోలు చేయడం ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేసింది. వేలంలో కేవలం ఏడుగుర్ని మాత్రమే కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. రూ. 6.90 కోట్లతో అత్యంత తక్కువగా వేలంలో వెచ్చించిన ఫ్రాంఛైజీగా నిలిచింది.
రూ. 20 లక్షల భారత హిట్టర్ గార్గెకి ఏకంగా రూ. 1.9 కోట్లు
వేలం తొలి సెషన్ ఆఖర్లో విరాట్ సింగ్ని రూ. 1.9 కోట్లకి కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత.. ప్రియమ్ గార్గెని కూడా అదే ధరకి దక్కించుకుంది. ఇద్దరూ కనీస ధర రూ. 20 లక్షలతో వేలంలోకి రావడం విశేషం. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ మార్ష్ని రూ. 2 కోట్లకి కొనుగోలు చేయడం ద్వారా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకున్న సన్రైజర్స్.. సందీప్ (రూ. 20 లక్షలు), పాబిన్ అలెన్ (రూ. 50 లక్షలు), అబ్దుల్ సమద్ (రూ. 20లక్షలు), సంజయ్ యాదవ్ (రూ. 20 లక్షలు)లను కొనుగోలు చేసింది.
Twitter-#OrangeArmy, presenting our squad for #IPL2020! 🧡...
మార్ష్తో బౌలింగ్ బలం పెరిగింది.. మరి బ్యాటింగ్..?
సీనియర్ హిట్టర్ యూసఫ్ పఠాన్ని వేలంలోకి వదిలిపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. అతని స్థానాన్ని మాత్రం ఎవరితోనూ భర్తీ చేయలేదు. వేలంలో ఆఖరిగా యూసఫ్ పఠాన్ రూ. కోటికే వస్తున్నా.. అతడ్ని కొనుగోలు చేసేందుకు సన్రైజర్స్తో పాటు ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు. దీంతో.. అతను అమ్ముడుపోని క్రికెటర్గా మిగిలిపోయాడు. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో ఉండగా.. మిడిలార్డర్ విలియమ్సన్; మనీశ్ పాండే ఆడనున్నారు. కానీ.. వీరి తర్వాత టీమ్లో నిలకడగా బ్యాటింగ్ చేసేది ఎవరు..? అనేది దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. నిషేధం కారణంగా బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా టీమ్కి దూరమైన విషయం తెలిసిందే. ఇతని స్థానాన్ని కూడా సన్రైజర్స్ భర్తీ చేసే ప్రయత్నం చేయకపోవడం కొసమెరుపు.
Twitter-Coming all the way from the Caribbeans is Fabian A...
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.