యాప్నగరం

ధోనీపై కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.

TNN 20 Apr 2017, 5:58 pm
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీం కోర్టు గురువారం కొట్టేసింది. ఓ బిజినెస్ మ్యాగజైన్‌లో ముద్రించిన ధోనీ విష్ణు అవతారం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి గతంలో క్రిమినల్ కేసు పెట్టారు. అయితే ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఆ ప్రకటన లేదని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో సుప్రీం కోర్టు బెంచ్ వెల్లడించింది. ధోనీపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
Samayam Telugu supreme court quashes complaint against ms dhoni
ధోనీపై కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు


కాగా, 2013లో ఓ బిజినెస్ మ్యాగజైన్ కవర్‌పేజ్‌పై విష్ణు అవతారంలో ధోనీ ఫొటోను ముద్రించారు. ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తు్న్న బ్రాండ్లను ఒక్కో చేతిలో ఒక్కోటి చొప్పున ఉంచారు. వీటిలో రీబాక్ షూ కూడా ఉంది. దీనికి విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాం సుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో అనంతపురం కోర్టు ధోనీపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ధోనీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును సుప్రీం కోర్డు కొట్టేయడంతో ధోనీకి ఊరట లభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.