యాప్నగరం

టీ20 జట్టులోకి మళ్లీ వస్తా: సురేశ్ రైనా

టీమిండియాలోకి త్వరలోనే తాను పునరాగమనం చేస్తానని భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ధీమా వ్యక్తం చేశాడు. గత

TNN 23 Jan 2018, 3:05 pm
టీమిండియాలోకి త్వరలోనే తాను పునరాగమనం చేస్తానని భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ధీమా వ్యక్తం చేశాడు. గత ఏడాది చివర్లో యో-యో ఫిటెనెస్ టెస్టు పాసైన సురేశ్ రైనా.. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా సోమవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున మెరుపు శతకంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఫిటెనెస్ సమస్యలు, పేలవ ఫామ్ కారణంగా దాదాపు రెండేళ్లుగా వన్డే జట్టుకి దూరంగా ఉంటున్న రైనా.. గత ఏడాది ఫిబ్రవరిలో చివరిసారి భారత్ టీ20 జట్టులో ఆడాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి దక్షిణాఫ్రికా‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా నుంచి తనకి పిలుపొస్తుందనే ధీమాతో రైనా ఉన్నాడు.
Samayam Telugu suresh raina hopeful of india comeback soon
టీ20 జట్టులోకి మళ్లీ వస్తా: సురేశ్ రైనా


‘భారత్ జట్టులోకి పునరాగమనం చేసేందుకు చాలా కష్టపడుతున్నాను. టీ20ల్లో మళ్లీ శతకంతో ఫామ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదీ.. సౌరవ్ గంగూలీ లాంటి గొప్ప క్రికెటర్లు ప్రత్యక్షంగా చూస్తున్న సమయంలో శతకం సాధించడం మరింత సంతోషం. గత కొద్దిరోజులుగా కోచ్‌ సాయంతో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ తప్పిదాలను దిద్దుకుంటున్నా. త్వరలోనే టీమిండియా తరఫున టీ20లు ఆడతాననే నమ్మకం నాకుంది. ప్రస్తుత ఫామ్‌ని కొనసాగించాలని ఆశిస్తున్నా’ అని రైనా వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.