యాప్నగరం

యువరాజ్.. ధోనీ నాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు: సురేశ్ రైనా

ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లని అప్పట్లో నిర్దాక్ష్యిణంగా కెప్టెన్ ధోనీ తప్పించేవాడు. కానీ.. సురేశ్ రైనా విషయంలో ఫేవరటిజం చూపేవాడని ఇటీవల యువరాజ్ సింగ్ విమర్శించాడు.

Samayam Telugu 26 May 2020, 9:30 am
‘‘మహేంద్రసింగ్ ధోనీ ఫేవరెట్ ప్లేయర్ సురేశ్ రైనా.. అప్పట్లో కెప్టెన్‌ ధోనీ మద్దతు అతనికి ఫుల్‌‌గా ఉండేది. 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ నా స్థానంలో సురేశ్ రైనాని ఆడించేందుకు ధోనీ ప్రయత్నించాడు’’ రెండు వారాల క్రితం ధోనీపై యువరాజ్ సింగ్ చేసిన విమర్శ ఇది. దాంతో.. ధోనీ పేరు ఎత్తగానే అంతెత్తున లేచే యువీ తండ్రి యోగరాజ్ సింగ్.. ఓ నాలుగు రోజుల పాటు ధోనీపై పెద్దఎత్తున నిప్పులు చెరిగాడు. యువీ కెరీర్‌ని ధోనీ నాశనం చేశాడంటూ మండిపడ్డాడు. కానీ.. ధోనీ మాత్రం స్పందించలేదు. అయితే.. సురేశ్ రైనా తాజాగా యువీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Samayam Telugu raina 2


Read More: సెలక్టర్లూ.. తప్పులుంటే నా ముఖంపై చెప్పండి: సురేశ్ రైనా

‘‘అవును నిజమే.. ధోనీ నాకు మద్దతుగా నిలిచాడు. దానికి కారణం.. నాలో టాలెంట్ ఉందని అతను విశ్వసించడమే. ధోనీ నాకు సపోర్ట్ చేసిన ప్రతిసారి నేను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాను. ఒకవేళ నేను ఓ రెండు మ్యాచ్‌ల్లో ఫెయిలైతే..? ధోనీ నుంచి నాకు వార్నింగ్ వచ్చేది. ‘నువ్వు స్కోర్లు చేయలేదో..? కెప్టెన్‌గా నేను కఠిన నిర్ణయం తీసుకుంటాను’ అని ధోనీ చెప్పేవాడు. ఆ టైమ్.. ధోనీ ప్లీజ్ ఓ రెండు అవకాశాలివ్వవా..? మళ్లీ ఆ తప్పులు చేయను అని కోరేవాడ్ని’’ అని సురేశ్ రైనా వెల్లడించాడు.

Read More: undefined


ధోనీ కెప్టెన్‌గా ఉన్న రోజులూ టీమిండియాలో సురేశ్ రైనా, రవీంద్ర జడేజాకి చోటు విషయంలో ఢోకా ఉండేది కాదు. కానీ.. 2017లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా.. ఆ తర్వాత ఏడాదే జట్టులో స్థానం కోల్పోయిన రైనా.. గత రెండేళ్లుగా పునరాగమనం కోసం నిరీక్షిస్తున్నాడు. జడేజా మాత్రం రెగ్యులర్‌ ఆటగాడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.