యాప్నగరం

నెక్ట్స్ బ్యాటింగ్: సఫారీ గడ్డకు సురేశ్ రైనా..

సురేశ్‌ రైనా భారత జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ కోసం అతడు ఎంపికయ్యాడు.

TNN 10 Feb 2018, 10:40 pm
భారత స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్‌ రైనా.. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో అతడు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా ఆదివారం (ఫిబ్రవరి 10) దక్షిణాఫ్రికాకు బయలుదేరనున్నాడు. ఫిబ్రవరి 18 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది.
Samayam Telugu suresh raina to join india squad for t20i series with south africa
నెక్ట్స్ బ్యాటింగ్: సఫారీ గడ్డకు సురేశ్ రైనా..


భారత్‌ తరఫున రైనా చివరిసారిగా 2017 ఫిబ్రవరి 1న ఇంగ్లాండ్‌పై ఆడాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ సమస్యలు, యో యో టెస్టు పాసవ్వకపోవడం తదితర కారణాలతో ఏడాదిపాటు జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. గత ఏడాది చివర్లో యో యో టెస్టు పాసైన రైనా తాజాగా సఫారీలతో టీ20 సిరీస్‌‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.