యాప్నగరం

​సిడ్నీ టెస్టుకి భారత ఓపెనింగ్ జోడీని మార్చండి: గవాస్కర్ సూచన

సిడ్నీ టెస్టులో పృథ్వీ షా ఆరంభంలోనే పేలవరీతిలో వికెట్ చేజార్చుకోగా.. రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ మరింతగా నిరాశపరుస్తూ వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా.. తొలి రెండు టెస్టుల్లో భారత్‌కి మెరుగైన ఓపెనింగ్ భాగస్వామ్యం లభించలేదు.

Samayam Telugu 1 Jan 2021, 8:31 am
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకి భారత ఓపెనింగ్ జోడీలో మార్పులు చేయాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇటీవల ముగిసిన అడిలైడ్, మెల్‌బోర్న్ టెస్టుల్లో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్-పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్- శుభమన్ గిల్‌లు ఆడారు. కానీ.. ఇందులో ఏ జోడీ కూడా తొలి వికెట్‌కి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పలేకపోయింది. తొలి టెస్టులో పృథ్వీ షా తొందరగా ఔటైతే.. రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. సిడ్నీ టెస్టుకి ఓపెనింగ్ జోడీలో మార్పులు చేయాలని గవాస్కర్ సూచిస్తున్నాడు.
Samayam Telugu Team India opening pair (Image Credit: AFP)


సిడ్నీ టెస్టుకి సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమవగా.. అతనికి జోడీగా మయాంక్ అగర్వాల్‌ని పంపాలని గవాస్కర్ సూచించాడు. అలానే మెల్‌బోర్న్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 45, 35 (నాటౌట్) పరుగులు చేసిన శుభమన్ గిల్‌ని నెం.5 స్థానంలో ఆడించాలని ప్రతిపాదించాడు. గవాస్కర్ సూచనని టీమిండియా మేనేజ్‌మెంట్ పరిగణలోకి తీసుకుంటే..? తెలుగు క్రికెటర్ హనుమ విహారిపై వేటు పడనుంది.

‘‘మయాంక్ అగర్వాల్‌‌ని సిడ్నీ టెస్టులో ఆడించాలి. నిజమే.. అతను తొలి రెండు టెస్టుల్లోనూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కానీ.. మయాంక్ నాణ్యమైన ఆటగాడు. అందుకే.. సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మకి జోడీగా అతడ్ని ఓపెనర్‌గా పంపాలి. ఇక శుభమన్ గిల్ అంటారా..? అతను టాప్ ఆర్డర్‌లో ఎక్కడైన ఆడగలడు. కాబట్టి.. నెం.5లో బ్యాటింగ్‌కి పంపడం మేలు’’ అని గవాస్కర్ సూచించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.