యాప్నగరం

Prithvi Shaw : భారత సెలెక్టర్లపై కోపంతో టీ20ల్లో శతకం బాదిన ఓపెనర్

Prithvi Shaw Century తో భారత ఓపెనింగ్ స్థానం కోసం పోటీ మరింత పెరిగింది. గత కొంతకాలంగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న ఈ యువ ఓపెనర్ టీ20లో సెంచరీతో ఒక్కసారి మళ్లీ రేసులోకి వచ్చాడు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 14 Oct 2022, 3:08 pm

ప్రధానాంశాలు:

  • పృథ్వీ షాని పట్టించుకోని భారత సెలెక్టర్లు
  • ఇటీవల సెలెక్టర్ల తీరుని విమర్శించిన ఓపెనర్
  • ఈరోజు అస్సాంపై మెరుపు శతకం నమోదు
  • టీ20 కెరీర్‌లో అతనికి ఇదే ఫస్ట్ సెంచరీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Prithvi Shaw T20 Century
పృథ్వీ షా సెంచరీ (Pic Source: Twitter)
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఇటీవల భారత సెలెక్టర్ల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. దేశవాళీ క్రికెట్‌లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నా తనని దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేయకపోవడంపై మండిపడ్డాడు. అయినప్పటికీ పరుగుల వేట ఆపనని చెప్పుకొచ్చిన పృథ్వీ షా.. వారం వ్యవధిలోనే టీ20ల్లో సెంచరీ నమోదు చేసేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో (Syed Mushtaq Ali Trophy) ముంబయి జట్టుని కెప్టెన్‌గా నడిపిస్తున్న పృథ్వీ షా ఈరోజు అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 61 బంతుల్లోనే 134 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. దెబ్బకి ముంబయి జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 230 పరుగులు చేయగలిగింది.

మ్యాచ్‌లో ఫస్ట్ నుంచి పృథ్వీ షా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. పవర్‌ ప్లేలో వరుస బౌండరీలు బాదిన ఈ యువ ఓపెనర్ కసితో బ్యాటింగ్ చేసినట్లు కనిపించింది. అతను కేవలం 19 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా జోరుని కొనసాగిస్తూ 46 బంతుల్లోనే టీ20 కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.

వాస్తవానికి 2019 ఐపీఎల్‌లోనే పృథ్వీ షా సెంచరీ మార్క్‌ని అందుకునేలా కనిపించాడు. కానీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 99 పరుగుల వద్ద ఔటైపోయాడు. అయితే.. తాజాగా ఎట్టకేలకి 100 పరుగులు చేసి మళ్లీ భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.