యాప్నగరం

ఫీల్డింగ్‌లో యువీ మెరుపులు.. సూపర్ ఓవర్లో పంజాబ్ గెలుపు

ఫీల్డింగ్‌లో యువీ మెరుపు క్యాచ్‌లు అందుకున్న వేళ.. కుర్ర బౌలర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో పంజాబ్ సూపర్ ఓవర్లో గెలుపొందింది.

TNN 21 Jan 2018, 6:45 pm
వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ రాణించడంతో కర్ణాటకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో పంజాబ్ గెలుపొందింది. ఆదివారం నిర్వహించిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ మ్యాచ్‌లో కర్ణాటక 159 పరుగుల లక్ష్యాన్ని విధించగా.. పంజాబ్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 159 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్లో యువరాజ్, మన్‌దీప్ జోడి 14 రాబట్టింది. సూపర్ ఓవర్లో సిద్ధార్థ్ కౌల్ చక్కగా బౌలింగ్ చేయడంతో 11 రన్స్‌కే పరిమితమైన కర్ణాటక ఓటమిపాలైంది.
Samayam Telugu syed mushtaq ali trophy yuvraj harbhajan star in punjabs thrilling win
ఫీల్డింగ్‌లో యువీ మెరుపులు.. సూపర్ ఓవర్లో పంజాబ్ గెలుపు


ఫీల్డింగ్‌లో యువరాజ్ సింగ్ అదరగొట్టాడు. స్క్వేర్ లెగ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకొని స్టువర్ట్ బిన్నీ, గౌతమ్‌లను పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్‌లోనూ 25 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మన్‌దీప్ పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభం ఇవ్వగా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన హర్భజన్ 19 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. చివరి బంతికి పంజాబ్ బ్యాట్స్‌మెన్ సందీప్ శర్మ బౌండరీ బాదడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్లో పంజాబ్ గెలుపొందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.