యాప్నగరం

టీ20 లీగ్: రహానేకు రూ.7 లక్షలు, రోహిత్‌కు రూ.6 లక్షలు

టీ20 ముంబై లీగ్‌లో రోహిత్ శర్మ కంటే రహానేకు వేలంలో ఎక్కువ మొత్తం. ఇందుకు కారణమేంటో తెలుసా?

TNN 4 Mar 2018, 4:14 pm
ముంబై: స్థానిక యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ‘ముంబై టీ20 క్రికెట్ లీగ్‌’ను మార్చి 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో ఆరు జట్లు బరిలో దిగనున్నాయి. ఈ జట్లు ఇప్పటికే ఐకాన్ ఆటగాళ్లు, మెంటార్ కోచ్‌లను ప్రకటించాయి. ఐకాన్ ప్లేయర్ల ఎంపిక కోసం శనివారం నిర్వహించిన వేలంలో ముంబై నార్త్ వెస్ట్ జట్టు రోహిత్ శర్మను రూ. 6 లక్షలకు సొంతం చేసుకుంది. అంజిక్య రహానే, సూర్యకుమార్ యాదవ్‌లను ముంబై నార్త్, ముంబై నార్త్ ఈస్ట్ రూ.7 లక్షలకు కొనుగోలు చేశాయి. రోహిత్ శర్మ కంటే రహానేకు వేలంలో ఎక్కువ ధర పలకడం విశేషం.
Samayam Telugu t20 mumbai league heres why rohit fetched lesser moolah than rahane and suryakumar
టీ20 లీగ్: రహానేకు రూ.7 లక్షలు, రోహిత్‌కు రూ.6 లక్షలు


కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ త్రైపాక్షిక టీ20లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ మార్చి 6-18 తేదీల మధ్య జరగనుంది. దీంతో ముంబై టీ20 లీగ్‌లో మెజార్టీ మ్యాచ్‌లకు రోహిత్ దూరం కానున్నాడు. అందుకే అతడికంటే రహానేకు ఎక్కువ మొత్తం దక్కింది.

ముంబై నార్త్ సెంట్రల్ జట్టు రూ. 5 లక్షలకు శ్రేయస్ అయ్యర్‌ను తమ ఐకాన్ ప్లేయర్‌గా కొనుగోలు చేయగా.. ముంబై సౌత్ రూ. 4 లక్షలు వెచ్చించి అభిషేక్ నాయర్‌ను తమ ఐకాన్ ప్లేయర్‌గా దక్కించుకుంది. నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు ఐకాన్ ప్లేయర్‌తోపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సత్తా చాటుతున్న ఐదుగురు ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వాంఖడే స్టేడియంలో మార్చి 11 నుంచి 21 తేదీల మధ్య ముంబై టీ20 క్రికెట్ లీగ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సచిన్ టెండుల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ట్రైనింగ్ కారణంగా ఈ లీగ్‌కు దూరంగా ఉండనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.