యాప్నగరం

ధోనీ రీఎంట్రీపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాలి: పఠాన్

ఐపీఎల్ 2020 సీజన్‌లో ధోనీ ఫామ్ నిరూపించుకుంటే టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేసేందుకు మాకేమీ అభ్యంతరం లేదు - గత ఏడాది టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు

Samayam Telugu 30 Mar 2020, 12:21 pm
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్లిటీ ఇవ్వాలని మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ డిమాండ్ చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోని.. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టింది లేదు. దీంతో.. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీ ఆడటంపైనా సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు బీసీసీఐ కూడా ఆటగాళ్లకి ఇచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి ధోనిని తప్పించింది.
Samayam Telugu MS Dhoni 2019


Read More: ఐపీఎల్ 2020 రద్దు..? చేతులెత్తేసిన బీసీసీఐ

భారత్ జట్టులోకి ధోనీ రీఎంట్రీ ఇవ్వాలంటే ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని టీమిండియా మేనేజ్‌మెంట్ చెప్తుండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. దీంతో.. ఇప్పుడు ధోనీ కెరీర్ పూర్తిగా ప్రశ్నార్థకంలో పడిపోయింది. మరోవైపు భారత్ జట్టుకి ధోని దూరమైన తర్వాత రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి వరుసగా సెలక్టర్లు అవకాశమిస్తున్నారు. దీంతో.. ఈ ఇద్దరిలోనే ఒకరు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ధోనీ మళ్లీ టీమిండియాకి ఆడతాడా..? లేదా..? అనే విషయంపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.

Read More: ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు కెప్టెన్‌గా ధోనీ ఎంపిక

‘‘ధోనీ తప్పకుండా మళ్లీ టీమిండియాకి ఆడాలి. అతను ఓ అద్భతమైన క్రికెటర్. కానీ.. ఇటీవల అతను టీమ్‌కి దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌ని వరుసగా ఆడిస్తున్నారు. వారు కూడా గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్నారు. కానీ.. ధోనీకి బదులుగా వారిని ఆడించడం కరెక్టేనా..? అనేది ఇప్పుడు ప్రశ్న. బీసీసీఐ మాత్రమే దీనికి సమాధానం చెప్పాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.