యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్లో నెం.3 స్థానంలో సూర్యకుమార్ని టీమిండియా మేనేజ్మెంట్ ఆడించాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. ప్రస్తుతం శ్రీలంక టూర్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. ఈ నెల 13 నుంచి లంకేయులతో ప్రారంభంకానున్న మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లో ఆడనున్నాడు. ఒకవేళ టీ20 వరల్డ్కప్లో విరాట్ కోహ్లీ ఓపెనర్గా ఆడితే..? అప్పుడు నెం.3లో సూర్యాని ఆడించాలని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఈ స్థానం కోసం కేఎల్ రాహుల్ కూడా పోటీలో ఉన్నాడు. ‘‘భారత టీ20 జట్టులో నెం.3 స్థానానికి పోటీలో సూర్యకుమార్ యాదవ్ ముందు వరుసలో ఉన్నాడు. మరీ ముఖ్యంగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను టీ20 వరల్డ్కప్లో ఓపెనర్గా ఆడతానని చెప్పిన తర్వాత ఆ స్థానం కోసం పోటీ పెరిగింది. నా అంచనా ప్రకారం కేఎల్ రాహుల్ని ఆ స్థానంలో ఆడించకపోవచ్చు. ఆ స్థానానికి సూర్యకుమార్ యాదవ్ బాగా సెట్ అవుతాడు. ఐపీఎల్లో సూర్యకుమార్ యాదవ్లా చాలా తక్కువ మంది మాత్రమే బ్యాటింగ్ చేయగలరు. ఏ దశలోనైనా గుడ్ బాల్స్ని కూడా అతను బౌండరీకి తరలించగలడు’’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
భారత జట్టులోకి అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఫస్ట్ బాల్నే సిక్స్గా మలిచిన విషయం తెలిసిందే. సూర్యా కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నెం.3 బ్యాటింగ్ స్థానాన్ని ఓ మ్యాచ్లో త్యాగం చేశాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్కి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్.. గత ఏడాది ముంబయి టైటిల్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.
భారత జట్టులోకి అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఫస్ట్ బాల్నే సిక్స్గా మలిచిన విషయం తెలిసిందే. సూర్యా కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నెం.3 బ్యాటింగ్ స్థానాన్ని ఓ మ్యాచ్లో త్యాగం చేశాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్కి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్.. గత ఏడాది ముంబయి టైటిల్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.