యాప్నగరం

లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్.. భారత క్రికెటర్‌కి రూ. 500 జరిమానా

కరోనా వైరస్ కట్టడి కోసం రూ. లక్షల్లో విరాళం ప్రకటిస్తున్న భారత క్రికెటర్లు.. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. కానీ.. సీనియర్ క్రికెటర్ ఒకరు లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసి జరిమానాకి గురయ్యాడు.

Samayam Telugu 10 Apr 2020, 12:56 pm
లాక్‌డౌన్ రూల్స్‌ బ్రేక్ చేసిన భారత క్రికెటర్ రిషి ధావన్‌కి రూ. 500 జరిమానా పడింది. హిమాచ‌ల్‌ప్రదేశ్‌‌కి చెందిన రిషి ధావన్.. తాజాగా తన సొంత కారులో బ్యాంక్ పని మీద రోడ్డుపైకి వచ్చాడు. దీంతో.. అతడి కారుని ఆపిన పోలీసులు.. లాక్‌డౌన్ రూల్స్‌‌ని అతిక్రమించినందుకు రూ. 500 జరిమానా విధించారు.
Samayam Telugu Rishi Dhawan


Read More: ఐపీఎల్ 2020 స్టార్ట్ తేదీపై మళ్లీ సందిగ్ధత

వాస్తవానికి రిషి ధావన్ రిలాక్సేషన్ పీరియడ్ (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట) టైమ్‌లోనే ఇంటి వెలుపలికి వచ్చాడు. కానీ.. అతని కారుకి ఎలాంటి వెహికల్ పాస్ లేకపోవడంతో పోలీసులు జరిమానా విధించారు. దీంతో.. అక్కడే జరిమానా కట్టేసి.. రిషి ధావన్ కారులో వెళ్లిపోయినట్లు తెలిసింది.

భారత్ తరఫున 2016లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడిన రిషి ధావన్ ఆ తర్వాత.. దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. హిమాచల్‌ప్రదేశ్ తరఫున రెగ్యులర్‌గా క్రికెటర్‌ ఆడుతున్న రిషి ధావన్.. ఇప్పటి వరకూ 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 3,702 పరుగులు, 308 వికెట్లు పడగొట్టాడు. అలానే.. లిస్ట్-ఎ క్రికెట్‌లో 125 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రిషి ధావన్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. 2017 తర్వాత ఐపీఎల్‌కీ ఈ ఆల్‌రౌండర్ దూరమయ్యాడు.

Read More: ఆసియా కప్ 2020 రద్దు.. పాకిస్థాన్ హింట్

భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్ విధించగా.. నిత్యావసరాలకి మినహా ఎవరూ ఇంటి వెలుపలికి రాకూడదని రూల్స్ పెట్టారు. అయితే.. ఈ నిబంధనల్ని అతిక్రమిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తుండగా.. మరికొందరు జరిమానాలు విధిస్తున్నారు. ఏప్రిల్ 14న లాక్‌డౌన్ గడువు ముగియనుండా.. ఇంకా కొన్ని రోజులు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి.

Read More:భారత్‌ని వెంటిలేటర్స్ సాయం కోరిన అక్తర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.