యాప్నగరం

Umesh Yadav Father Death | ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులోని బౌలర్ ఇంట విషాదం

Umesh Yadav Father Passed Away : భారత టెస్టు జట్టుతో ఉన్న పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ వైద్యులు కష్టమేనని తేల్చేశారు. దాంతో స్వగ్రామానికి తిలక్ యాదవ్‌ని కుటుంబ సభ్యులు తరలిచారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 23 Feb 2023, 1:03 pm

ప్రధానాంశాలు:

  • భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి మూడో టెస్టు
  • తొలి రెండు టెస్టులకీ భారత్ జట్టుతోనే ఉమేశ్ యాదవ్
  • గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమేశ్ తండ్రి
  • ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన రోజుల వ్యవధిలోనే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu India Test Squad
భారత టెస్టు జట్టు
ఆస్ట్రేలియాతో ప్రస్తుతం బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్న భారత టెస్టు జట్టులోని ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) ఇంట విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ (74) గురువారం కన్నుమూశారు. భారత్, ఆస్ట్రేలియా (Australia vs India) మధ్య ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు ముగియగా.. రెండింటిలోనూ టీమిండియానే గెలిచింది. ఇక మూడో టెస్టు మ్యాచ్ ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభంకానుంది.
ఉమేశ్ యాదవ్ తండ్రి గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. ఇటీవల నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స కూడా అందించారు. కానీ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగవకపోవడంతో కొన్ని రోజుల క్రితం సొంతూరు మాలిక్ చౌక్‌కి తరలించారు. అక్కడ ఈరోజు తిలక్ యాదవ్ తుది శ్వాస విడిచారు. తొలి రెండు టెస్టుల్లో ఉమేశ్ యాదవ్‌కి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌ని తుది జట్టులో ఆడించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఉమేశ్ యాదవ్‌ని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశాడు.

2010లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉమేశ్ యాదవ్.. గత కొన్ని రోజులుగా కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. కానీ.. టెస్టుల్లోనూ తుది జట్టులో ఈ ఫాస్ట్ బౌలర్‌కి అవకాశాలు దక్కడం లేదు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఉమేశ్ యాదవ్ మ్యాచ్‌లు ఆడబోతున్నాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.