యాప్నగరం

శ్రీలంకలో జెండా ఎగురవేసిన కోహ్లి..!

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీమిండియా శ్రీలంకలో వేడుకలు జరుపుకుంది. భారత్ క్రికెటర్లు

TNN 15 Aug 2017, 2:05 pm
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీమిండియా శ్రీలంకలో వేడుకలు జరుపుకుంది. భారత్ క్రికెటర్లు, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సహాయ సిబ్బంది హాజరైన ఈ వేడుకల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి జెండా ఎగురవేశాడు. శ్రీలంకతో సుదీర్ఘ సిరీస్ నేపథ్యంలో భారత్ జట్టు ప్రస్తుతం అక్కడే పర్యటిస్తోంది. ఇప్పటికే ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా విదేశీగడ్డపై తొలిసారి క్లీన్‌స్వీప్ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది.
Samayam Telugu team india hoist the tri colour at kandy
శ్రీలంకలో జెండా ఎగురవేసిన కోహ్లి..!


ఆగస్టు 20 నుంచి శ్రీలంకతో ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో భారత్ తలపడనుది. సీనియర్ క్రికెటర్లు అశ్విన్, షమీ, ఉమేశ్ యాదవ్‌, జడేజాలకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, మనీశ్ పాండే‌కి వన్డే జట్టులో చోటిచ్చిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.