యాప్నగరం

భారత్‌ ఆ బలహీనతని అధిగమించాలి..!

ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న ప్రపంచకప్‌లోపు భారత జట్టు మిడిలార్డర్‌ బలహీనతపై దృష్టి పెడితే మంచిదని బ్యాటింగ్ కోచ్

Samayam Telugu 17 Jul 2018, 12:45 pm
ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న ప్రపంచకప్‌లోపు భారత జట్టు మిడిలార్డర్‌ బలహీనతపై దృష్టి పెడితే మంచిదని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సూచించాడు. ఇంగ్లాండ్‌తో గత శనివారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో మిడిలార్డర్‌ ఫెయిలవడంతో భారత్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక మూడో వన్డే ఈరోజు సాయంత్రం 5 గంటలకి జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో సంజయ్ బంగర్ మాట్లాడాడు. రెండో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి ఫర్వాలేదనిపించినా.. మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్, మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య విఫలమయ్యారు. దీంతో.. 323 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ 236 పరుగులకే ఆలౌటైంది.
Samayam Telugu Dh7B4blXcAAPGKs


‘భారత్ జట్టు ఇప్పటి నుంచి 2019 ప్రపంచకప్‌లోపు దాదాపు 16-17 వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. కాబట్టి.. మెగా టోర్నీ కంటే ముందే మిడిలార్డర్‌ బలహీనతను టీమిండియా అధిగమించాల్సి ఉంది. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లు.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. కానీ.. మిడిలార్డర్‌లో నిలకడగా ఆడగలిగే వారుంటేనే మంచిది. ఎందుకంటే.. 8, 9, 10వ స్థానాల్లో సమర్థంగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో లేరు. అందుకే ఆరు, ఏడు స్థానాల్లో మెరుగ్గా బ్యాటింగ్ చేసేవాళ్లుండాలి’ అని సంజయ్ బంగర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.