భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆసియా కప్ 2022 (Asia Cup 2022)లో భాగంగా హాంకాంగ్తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 13 బంతుల్లోనే 2x4, 1x6 సాయంతో 21 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఇంటర్నేషనల్ టీ20ల్లో 3500 పరుగుల మార్క్ని అందుకున్న తొలి క్రికెటర్గా నిలిచాడు. 2007 నుంచి అంతర్జాతీయ టీ20లకి ప్రాచుర్యలం లభించగా.. ఇప్పటి వరకూ ఏ క్రికెటర్ ఈ మార్క్ని అందుకోలేకపోయారు. ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ 3520 పరుగులతో టాప్లో కొనసాగుతున్నాడు. 2007 నుంచి బుధవారం వరకూ 134 మ్యాచ్లాడిన హిట్మ్యాన్ 139.84 స్ట్రైక్రేట్, 32.00 సగటుతో ఈ పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. రోహిత్ శర్మ తర్వాత స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా మార్టిన్ గప్తిల్ (3497), విరాట్ కోహ్లీ (3402) టాప్-3లో కొనసాగుతున్నారు.
2007లో అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ 45 టెస్టుల్లో 3137 పరుగులు, 233 వన్డేల్లో 9376 రన్స్ చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు ఉండగా.. 37 సెంచరీలు, 59 అర్ధశతకాలూ ఉన్నాయి.
2007లో అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ 45 టెస్టుల్లో 3137 పరుగులు, 233 వన్డేల్లో 9376 రన్స్ చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు ఉండగా.. 37 సెంచరీలు, 59 అర్ధశతకాలూ ఉన్నాయి.