టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్లో మళ్లీ జోరందుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్లో 231 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. పుణె వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన తొలి వన్డేలోనూ 56 పరుగులు చేశాడు. దాంతో.. రెండు ఫార్మాట్లలోనూ కోహ్లీ మెరుగైన ర్యాంక్ని సొంతం చేసుకున్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య పుణె వేదికగానే శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకి రెండో వన్డే ప్రారంభంకానుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో ఐదో స్థానం నుంచి నాలుగుకి విరాట్ కోహ్లీ ఎగబాకాడు. టాప్లో ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలాన్ ఉన్నాడు. అలానే ఇంగ్లాండ్తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్లో నాలుగు మ్యాచ్ల్లో ఓపెనర్గా ఆడిన కేఎల్ రాహుల్ 1, 0, 0, 14 పరుగులతో నిరాశపరిచాడు. దాంతో ర్యాంకింగ్స్లో నాలుగో స్థానం నుంచి ఐదుకి రాహుల్ పడిపోయాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో టాప్-10లో భారత్ బౌలర్ ఎవరూ చోటు దక్కించుకోలేకపోయారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ 868 పాయింట్లతో నెం.1 స్థానంలోనే కొనసాగుతుండగా.. అతని తర్వాత స్థానంలో బాబర్ అజామ్, రోహిత్ శర్మ టాప్-3లో ఉన్నారు. తొలి వన్డేలో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రెండో స్థానం నుంచి మూడుకి పడిపోయాడు. ఈ ఇద్దరు మినహా.. భారత్ నుంచి ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ 868 పాయింట్లతో నెం.1 స్థానంలోనే కొనసాగుతుండగా.. అతని తర్వాత స్థానంలో బాబర్ అజామ్, రోహిత్ శర్మ టాప్-3లో ఉన్నారు. తొలి వన్డేలో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రెండో స్థానం నుంచి మూడుకి పడిపోయాడు. ఈ ఇద్దరు మినహా.. భారత్ నుంచి ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు.