యాప్నగరం

సంచలనం: టీ20ల్లో డబుల్ సెంచరీ

స్పోర్టింగ్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించిన హరికృష్ణన్ డబుల్ సెంచరీ చేసినా ఆ జట్టు ఓడిపోవడం గమనార్హం.

Samayam Telugu 3 Nov 2018, 11:32 pm
శతకం బాదినంత ఈజీగా యువ క్రికెటర్ టీ20 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. దుబాయ్‌ వేదికగా క్లబ్‌ క్రికెట్‌ ఆధ్వర్యంలో అలియన్స్‌ టీ20 లీగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేవీ హరికృష్ణన్ అనే 19 ఏళ్ల క్రికెటర్ 78 బంతుల్లో 22 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. స్పోర్టింగ్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించిన హరికృష్ణన్ డబుల్ సెంచరీతో ఆ జట్టు 20ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు మెకోస్ క్రికెట్ క్లబ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
Samayam Telugu Batting


అయితే 172 పరుగులను బౌండరీల రూపంలో 36 బంతుల్లో చేయడం విశేషం. కానీ హరికృష్ణన్ జట్టు ఈ టీ20లో ఓడిపోయింది. లక్ష్యచేధనకు దిగిన మెకోస్ క్రికెట్ క్లబ్ ఆటగాళ్లు రాణించడంతో 17 ఓవర్లలోనే భారీ లక్ష్యాన్ని చేరుకుని ఘన విజయం సాధించింది. స్పోర్టింగ్ క్రికెట్ టీమ్ ఓడినా అద్భుత ప్రదర్శన చేసిన హరికృష్ణన్‌నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

నా లక్ష్యం ఐపీఎల్: హరికృష్ణన్
వేగంగా ఆడటం తనకు ప్లస్ పాయింట్ అని, అందులోనూ హార్డ్ హిట్టింగ్ చేయడంతో తేలికగా పరుగులు చేస్తానని మ్యాచ్ అనతరం హరికృష్ణన్ చెప్పాడు. ఒల్లాంగాంగ్ వర్సిటీ తరఫున ఆడిన తాను గతంలో 33 బంతుల్లోనూ సెంచరీ చేసినట్లు తెలిపాడు. 17 ఏళ్ల వయసులో షార్జా స్టేడియం బయటకు రెండు సిక్సర్లు బాది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎప్పటికైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఆడాలన్నదే తన లక్ష్యమని క్రికెటర్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.