యాప్నగరం

ధోనీ మాయ.. శతకం ముంగిట తరంగ ఔట్

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. మరోసారి వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శనతో మెప్పించాడు. విశాఖపట్నం వేదికగా

TNN 17 Dec 2017, 3:42 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. మరోసారి వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శనతో మెప్పించాడు. విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో శతకానికి చేరువైన ఓపెనర్ ఉపుల్ తరంగ (95: 82 బంతుల్లో 12x4, 3x6)ని తెలివిగా స్టంపౌట్ చేసి భారత్‌ జట్టుకి బ్రేక్ ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ.. వరుస బౌండరీలు బాదేసిన తరంగ.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కాస్త ఇబ్బందిపడ్డాడు. దీన్ని గమనించిన ధోనీ.. కుల్దీప్‌తో కలిసి వ్యూహం రచించి తరంగని బోల్తా కొట్టించాడు.
Samayam Telugu tharanga falls after a blazing 95 india vs sri lanka 3rd odi
ధోనీ మాయ.. శతకం ముంగిట తరంగ ఔట్


ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్.. ఆఫ్ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని బంతుల్ని విసిరి.. కొంచెం క్రీజు వెలుపలికి టర్న్ చేస్తూ వచ్చాడు. దీంతో ఆ ఓవర్‌లోని రెండో బంతిని అందుకునేందుకు క్రీజు వెలుపలికి పాదం కదిపిన తరంగ.. బంతి అందకపోవడంతో వెంటనే మళ్లీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ.. క్షణాల వ్యవధిలోనే బంతిని అందుకున్న ధోనీ వికెట్లపై ఉన్న బెయిల్స్‌‌ను ఎగరగొట్టడంతో తరంగ నిరాశగా పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. ఆ ఓవర్‌‌లోని చివరి బంతిని కూడా ఇదే రీతిలో కుల్దీప్ విసరగా.. దాన్ని ప్లిక్ చేసేందుకు ప్రయత్నించి డిక్వెల్లా (8: 4 బంతుల్లో 2x4) స్లిప్‌లో ఫీల్డర్ శ్రేయాస్ అయ్యర్ చేతికి చిక్కాడు. దీంతో 27.5 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 168/4తో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.