యాప్నగరం

మ్యాచ్ రద్దుపై అధికారులు భయపడ్డారా..?

భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించేందుకు

TNN 14 Oct 2017, 2:23 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించేందుకు అధికారులు భయపడ్డారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఔట్‌ఫీల్డ్ బురదగా ఉండటంతో మ్యాచ్‌ జరిగే అవకాశం లేనందున విజేత నిర్ణయాత్మక మ్యాచ్‌ అయినప్పటికీ రద్దు చేయాల్సి వచ్చింది. వర్షం లేకపోవడం.. రోజంతా ఎండ ఉండటంతో మ్యాచ్ తప్పకుండా జరుగుతుందని వచ్చిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది.
Samayam Telugu the 3rd t20i against australia has been called off due to a wet outfield
మ్యాచ్ రద్దుపై అధికారులు భయపడ్డారా..?


మైదానం ఔట్‌ఫీల్డ్‌ని టేబుల్ ఫ్యాన్స్‌తో ఆరబెట్టిన సిబ్బంది.. మ్యాచ్ ఆరంభానికి ముందు మట్టిని చల్లి గట్టిపరిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దాదాపు మూడు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. ఔట్‌ఫీల్డ్‌లోని కొన్ని ప్రాంతాలు బురదగా ఉండటంతో చివరికి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటన కంటే అరగంట ముందు స్టేడియం నుంచి ఇరు జట్ల ఆటగాళ్లని ప్రత్యేక బస్సులలో వారు బస చేసిన హోటల్‌కి తరలించారు. గువహటిలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరిగిన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు స్టేడియంలో ఉన్నప్పుడు మ్యాచ్ రద్దు ప్రకటన చేస్తే.. ఫ్యాన్స్ నుంచి నిరసనలు వ్యక్తమవుతాయనే భయంతో అధికారులు తెలివిగా వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.