యాప్నగరం

టెస్టు జట్టులో స్థానం కోసం రోహిత్ పోటీ..?

వన్డే, టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ.. టెస్టు జట్టులో మాత్రం స్థానం కోసం ఇంకా

TNN 24 Jul 2017, 3:27 pm
Samayam Telugu the competition is always there says rohit sharmaafter
టెస్టు జట్టులో స్థానం కోసం రోహిత్ పోటీ..?
భారత వన్డే, టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ.. టెస్టు జట్టులో మాత్రం స్థానం కోసం ఇంకా పోటీని ఎదుర్కొంటూనే ఉన్నాడు. టెస్టుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే రోహిత్.. పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతూనే ఉన్నాడు. గత ఏడాది ఫర్వాలేదనిపించినా.. తొడకండరాల గాయం అతడి కెరీర్‌ని దెబ్బతీసింది. రోహిత్ గత ఏడాది అక్టోబరులో చివరిసారిగా న్యూజిలాండ్‌పై టెస్టు మ్యాచ్‌ ఆడాడు. తాజాగా శ్రీలంకతో బుధవారం నుంచి ఆరంభంకానున్న టెస్టు సిరీస్‌కి ఎంపికైన రోహిత్ శర్మ.. జట్టులో స్థానం కోసం నెలకొన్న పోటీపై గళం విప్పాడు.

‘జట్టులో పోటీ అనేది చాలా సర్వసాధారణం. మనం ఏ ఫార్మాట్‌లో ఆడుతున్నా ఈ పోటీ తప్పకుండా ఉంటుంది. వాస్తవానికి ఇలా సహచరుల మధ్య జట్టులో స్థానం కోసం ఆరోగ్యకరమైన పోటీ ఉండటం మంచిదే. అప్పుడే అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని రోహిత్ శర్మ వివరించాడు. గాలే వేదికగా బుధవారం నుంచి తొలి టెస్టు ఆరంభంకానుంది. టెస్టు జట్టు రెగ్యులర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ వివిధ కారణాలతో తొలి టెస్టుకి దూరమైన నేపథ్యంలో పరిమిత ఓవర్ల తరహాలో శిఖర్ ధావన్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.