యాప్నగరం

T20 World Cup: బ్యాడ్ సెంటిమెంట్‌తో ఆసీస్‌కు కలవరం..

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. వచ్చే ఏడాద జరగనున్న మెగా టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ కంగారూలను కలవరానికి గురి చేస్తోంది.

Samayam Telugu 29 Jan 2019, 6:23 pm
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న ఈ పోటీలకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 మధ్య మహిళల ప్రపంచ కప్ నిర్వహించనుండగా.. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 18 మధ్య పురుషుల ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మహిళల వరల్డ్ కప్ విషయానికి వస్తే.. ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఆస్ట్రేలియాను కంగారు పెడుతోంది. ఇప్పటి వరకూ మహిళల టీ20 ప్రపంచ కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన దేశమేదీ కప్ గెలవలేదు.
Samayam Telugu t20 world cup1


తొలి ప్రపంచకప్‌కు ఆతిథ్య ఇచ్చిన ఇంగ్లాండ్ ఫైనల్ చేరింది కానీ.. కప్ మాత్రం చేజార్చుకుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ కూడా వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగాయి. 2010, 2018ల్లో ఆతిథ్యం ఇచ్చిన వెస్టిండీస్ రెండుసార్లూ సెమీఫైనల్ చేరింది. కానీ ఫైనల్ మాత్రం చేరలేకపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఆతిథ్య జట్లకు ఇదో శాపంలా మారింది.

ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఇప్పటి వరకూ 6 వరల్డ్ కప్‌లను నిర్వహిస్తే.. నాలుగుసార్లు కంగారూలే గెలుపొందారు. 2010-14 మధ్య వరుసగా నాలుగు టీ20 వరల్డ్ కప్‌లను ఆసీస్ మహిళలు గెలుచుకున్నారు. ఆ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువలేదు. 2020 టీ20లో ఫేవరేట్‌గా ఆసీస్ బరిలో దిగనుంది. కానీ సొంత గడ్డ మీద ఆస్ట్రేలియా విజయాల రికార్డ్ ఆశాజనకంగా లేదు. ఈ పరిస్థితుల్లో.. ఆస్ట్రేలియా మహిళల జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.