యాప్నగరం

వెహికల్ ఎవరు గెలిచినా.. డ్రైవర్ ధోనీనే..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్స్ అంటే మహా సరదా. కెరీర్ తొలినాళ్ల నుంచే జట్టులో ఎవరికైనా

TNN 4 Sep 2017, 6:03 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్స్ అంటే మహా సరదా. కెరీర్ తొలినాళ్ల నుంచే జట్టులో ఎవరికైనా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌’, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రూపంలో బైక్‌ వస్తే దాన్ని గ్రౌండ్‌లోనే సరదాగా ఒక రౌండ్ వేసేవాడు. ఒక్కోసారి యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలు సైతం వెనకవైపు కూర్చుని ధోనీ బైక్ రైడింగ్‌ని ఎంజాయ్ చేసేవారు. దాదాపు 13 ఏళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. మధ్యలో ఎన్నో బైక్స్, కార్లను ధోనీ మైదానంలో చక్కర్లు కొట్టించాడు.
Samayam Telugu the internet loved it when ms dhoni took team india for a spin after beating sri lanka
వెహికల్ ఎవరు గెలిచినా.. డ్రైవర్ ధోనీనే..!


శ్రీలంకతో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో 15 వికెట్లతో సత్తాచాటిన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ రూపంలో మల్టిక్స్ కారు బహుమతిగా వచ్చింది. ఇందులో భారత క్రికెటర్లని ఎక్కించుకున్న ధోనీ మైదానంలోనే ఒక రౌండ్ వేయించాడు. తాళం బుమ్రానే తీసుకున్నా.. డ్రైవర్ మాత్రం మళ్లీ ధోనీనే..!!

pic.twitter.com/IP1EqNIzNT — Virat Kohli (@Cricvids1) September 3, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.