బెంగళూరు టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ గాయపడటంతో అతని స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నిరీక్షణకి తెరదించుతూ ఆరేళ్ల నుంచి కనీసం ఒక టెస్టు మ్యాచ్ కూడా ఆడని పాట్ కమిన్స్ని ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత్ లాంటి కఠిన ప్రత్యర్థిపై టెస్టుల్లో అనుభవంలేని కమిన్స్ని ఎంపిక చేయడమేంటని పెదవి విరిచిన వారు కూడా ఉన్నారు. అయితే వీటన్నింటికీ కమిన్స్ మూడు రోజుల్లోనే సమాధానం ఇచ్చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ని రెండో రోజే బుట్టలో వేసిన కమిన్స్.. మూడో రోజు తన బౌలింగ్తో భారత్పై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి (6), అజింక్య రహానె (14), అశ్విన్ (3)లను తన బౌలింగ్తో బోల్తా కొట్టించి భారత్ భారీ స్కోరుకు గండికొట్టాడు. ఇందులో విరాట్ కోహ్లి బలహీనతను గుర్తించి అతణ్ని బుట్టలో వేయడంతోనే కమిన్స్ ఎక్కువ మార్కులు
కొట్టేశాడు.
రాంచీ టెస్టులో పదునైన పేస్ బౌలింగ్తో దుమ్ముదులుపుతున్న కమిన్స్ చేతివేళ్లలో మధ్యవేలు సాధారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే కొంచెం తక్కువగా ఉంది. చిన్న వయసులో కమిన్స్ పొరపాటున తన అరచేతిని తలుపు మధ్యలో పెట్టడం.. అదే సమయంలో అతని సోదరి తలుపు బలంగా వేయడంతో అతని మధ్య వేలు ఓ సెంటీమేటర్ మేర తెగిపోయింది. మైదానంలో బంతిని వేగంగా విసరడం, స్వింగ్ చేయడంలో ఈ వేలి పాత్ర ఎక్కువే ఉన్నా.. కమిన్స్ మాత్రం ఈ లోపాన్ని ఏమాత్రం కనబడనీయకుండా మెరుగైన ప్రదర్శనతో దూసుకొస్తున్నాడు. 2011లో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం టెస్టులో ఏడు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్న కమిన్స్.. ఆ టెస్టులోనే గాయంతో కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత వచ్చినా.. ఫిటెనెస్లేమి కారణంగా టెస్టుల్లో మాత్రం పునరాగమనం చేయలేకపోయాడు. మధ్యలో వన్డే, టీ20 మ్యాచ్లు ఆడుతున్నా చివరి వరకూ జట్టులో అతని స్థానం అనుమానమే. కానీ తాజాగా రాంచీ టెస్టుతో తానేంటో నిరూపించుకున్న కమిన్స్ ఇకపై జట్టులో చోటు గురించి కంగారు పడాల్సిన పనిలేదేమో..!
కొట్టేశాడు.
రాంచీ టెస్టులో పదునైన పేస్ బౌలింగ్తో దుమ్ముదులుపుతున్న కమిన్స్ చేతివేళ్లలో మధ్యవేలు సాధారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే కొంచెం తక్కువగా ఉంది. చిన్న వయసులో కమిన్స్ పొరపాటున తన అరచేతిని తలుపు మధ్యలో పెట్టడం.. అదే సమయంలో అతని సోదరి తలుపు బలంగా వేయడంతో అతని మధ్య వేలు ఓ సెంటీమేటర్ మేర తెగిపోయింది. మైదానంలో బంతిని వేగంగా విసరడం, స్వింగ్ చేయడంలో ఈ వేలి పాత్ర ఎక్కువే ఉన్నా.. కమిన్స్ మాత్రం ఈ లోపాన్ని ఏమాత్రం కనబడనీయకుండా మెరుగైన ప్రదర్శనతో దూసుకొస్తున్నాడు. 2011లో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం టెస్టులో ఏడు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్న కమిన్స్.. ఆ టెస్టులోనే గాయంతో కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత వచ్చినా.. ఫిటెనెస్లేమి కారణంగా టెస్టుల్లో మాత్రం పునరాగమనం చేయలేకపోయాడు. మధ్యలో వన్డే, టీ20 మ్యాచ్లు ఆడుతున్నా చివరి వరకూ జట్టులో అతని స్థానం అనుమానమే. కానీ తాజాగా రాంచీ టెస్టుతో తానేంటో నిరూపించుకున్న కమిన్స్ ఇకపై జట్టులో చోటు గురించి కంగారు పడాల్సిన పనిలేదేమో..!