యాప్నగరం

లార్డ్స్ తప్పిదాలను దిద్దుకుంటాం: కోహ్లి

ఇంగ్లాండ్‌తో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో భారత్ జట్టు పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బ్యాట్‌, బంతితో

Samayam Telugu 13 Aug 2018, 3:56 pm
Samayam Telugu London : Indias captain Virat Kohli leaves the pitch after he is caught by Engl...
ఇంగ్లాండ్‌తో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో భారత్ జట్టు పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బ్యాట్‌, బంతితో విఫలమైన టీమిండియా.. ఏ దశలోనూ ఆతిథ్య జట్టుకి పోటీనివ్వలేకపోయింది. దీంతో.. వరుసగా రెండో టెస్టులోనూ విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలవగా.. మూడో టెస్టు మ్యాచ్‌ శనివారం నుంచి ప్రారంభంకానుంది.

లార్డ్స్‌ టెస్టులో భారత్ ఓడిపోవడం నిరాశ కలిగించిందని మ్యాచ్‌ ముగిసిన తర్వాత చెప్పిన విరాట్ కోహ్లీ.. తప్పిదాలను దిద్దుకుని సిరీస్‌లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ‘భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌లో టెక్నికల్‌ లోపాలేమీ నాకు కనిపించలేదు. అయితే లార్డ్స్‌ పిచ్‌ అతిగా ఫాస్ట్ బౌలర్లకి సహకరించింది. దీంతో.. మా వ్యూహాల్ని ఆశించిన విధంగా అమలు చేయలేకపోయాం. ఇప్పుడు ఓటమి గురించి అతిగా ఆలోచించి ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి.. చేసిన తప్పిదాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం ఒక్కటే మార్గం. సిరీస్‌లో పుంజుకోవాలంటే అలా చేయక తప్పదు. ఇంకా చెప్పాలంటే ఒక స్పోర్ట్స్‌ పర్సన్‌కి అంతకు మించి మరో ఆప్షన్ కూడా ఉండదు’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.